త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్‌వోకు పోలీసుల నోటీసులు

KTR | అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం రోజున చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. తాజాగా కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

S

Telangana | Published On Sep 13, 2026, 8.54 pm IST

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్‌వోకు పోలీసుల నోటీసులు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం రోజున చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. తాజాగా కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబ‌ర్ 14న విచార‌ణ‌కు రావాలంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనలపై కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, వీరిద్దరూ హైకోర్టుని ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్ద‌ని పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. అయితే పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోర్టు సూచించింది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Advertisement
Advertisement