త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | డీసీసీ అధ్య‌క్షుల‌కు దిశానిర్దేశం చేసిన రాహుల్‌గాంధీ

Congress | రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షులు, పార్టీ శ్రేణుల‌కు పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్య‌క్ర‌మానికి రాహుల్‌ హాజ‌ర‌య్యారు.

A

Telangana | Published On Mar 2, 2026, 7.04 pm IST

Congress | డీసీసీ అధ్య‌క్షుల‌కు దిశానిర్దేశం చేసిన రాహుల్‌గాంధీ
Advertisement

Congress | త్రినేత్ర‌.న్యూస్‌ : రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షులు, పార్టీ శ్రేణుల‌కు పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్య‌క్ర‌మానికి రాహుల్‌తో పాటు పార్టీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు. పది రోజులపాటు కొనసాగిన ఈ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా, మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణ అందించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో శిక్షణా శిబిరం ముగిసింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ప్ర‌త్యేక విమానంలో బేగంపేట‌కు వ‌చ్చిన రాహుల్‌కు రేవంత్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వారు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో వికారాబాద్‌కు వెళ్లి, కార్య‌క్ర‌మ అనంత‌రం అదే హెలికాప్ట‌ర్‌లో తిరిగి బేగంపేట చేరుకున్నారు.

 

Advertisement
Advertisement