New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం
New EHS Scheme | తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. కొత్త ఈహెచ్ఎస్ పథకం అమలుకు చర్యలు ప్రారంభించింది.
ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు జారీ
అందుబాటులోకి నగదు రహిత చికిత్స సదుపాయం
New EHS Scheme | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. కొత్త ఈహెచ్ఎస్ పథకం అమలుకు చర్యలు ప్రారంభించింది. శనివారం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం సచివాలయంలో ట్రస్ట్ బోర్డు కన్వీనర్, ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) సీఈఓ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజీ-జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్తో సహా ఉద్యోగుల ఆరోగ్య పథకం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అలాగే అపోలో హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చర్చల అనంతరం, టీఎస్హెచ్ఏతో పాటు ఆసుపత్రుల బృందాలు ఏకగ్రీవంగా న్యూ ఈహెచ్ఎస్ పథకాన్ని శనివారం నుంచే తక్షణం అమలు చేయాలని అంగీకరించాయి. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స సదుపాయాలు నేటి నుండి అందుబాటులోకి వచ్చాయి. సమావేశంలో న్యూ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఇవి ఆసుపత్రుల ఎంపానెల్మెంట్, చికిత్స ప్రోటోకాల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాలకు సంబంధించిన సవరించిన విధివిధానాలను నిర్దేశిస్తాయి.
ఈ కొత్త పథకానికి ఆసుపత్రుల వర్గం సహకరించిన తీరుపై ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఇది ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. లబ్ధిదారులకు సకాలంలో, ఇబ్బంది లేకుండా చికిత్స లభించేలా న్యూ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేయడంలో పూర్తి సహకారం అందించాలని ఎంపానెల్డ్ ఆసుపత్రులందరికీ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.
సంబంధిత వార్తలు

Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ ‘ఇందిరమ్మ’ టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా
ఆగస్టు 22, 2026

Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం
ఆగస్టు 22, 2026

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ 'ఇందిరమ్మ' టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా
- ●MP Mallu Ravi | కొండా సురేఖ కనీసం మంత్రిగా ఖండించాల్సి ఉండే : ఎంపీ మల్లు రవి
- ●Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం
- ●TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
- ●Cambridge University | హైదరాబాద్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్
- ●Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు

Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ 'ఇందిరమ్మ' టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా

MP Mallu Ravi | కొండా సురేఖ కనీసం మంత్రిగా ఖండించాల్సి ఉండే : ఎంపీ మల్లు రవి

Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం

TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!



