Harish Rao | రైతుల పేరుతో రేవంత్రెడ్డి కొత్త డ్రామాలు : హరీశ్రావు
Harish Rao | ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, దాన్నుంచి ప్రజల దృష్టించి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? ఆయన ప్రశ్నించారు.
Harish Rao | ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, దాన్నుంచి ప్రజల దృష్టించి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? ఆయన ప్రశ్నించారు. అవే చేతగాని మాటలు, చెత్త వాగుడు తప్ప కొత్తగా ఏమైనా ఒరిగిందా? అంటూ నిలదీశారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే.. సీఎం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నాడని.. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం? చేసింది లేదు కాబట్టే ఇష్టం ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82వేల కోట్లు అయితే.. జూన్ 2026 నాటికే రూ.1.56లక్షల కోట్లు, రూ.1.75లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. బడ్జెట్లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా? అంటూ నిలదీశారు.
అబద్ధాలు నిజాలు కావు..
అబద్ధాలను పదిసార్లు చెప్పినా అవి నిజాలు కావని, లేనివి ఉన్నట్లు చెప్పినంత మాత్రాన రైతులు నమ్ముతారా..? ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారని. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతులను మోసం చేయడం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్పకాలిక రుణాలకే పరిమితం చేస్తామని ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్ను నమ్మేవారా?.. మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారం చేసుకోవడం కాదని, రైతులకు ఇచ్చిన హామీల అమలు కావాలన్నారు. లేనిపక్షంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో.. అన్నదాతను ఎలా మోసం చేసారో చర్చించేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు.. ఏ వేదికలోనైనా తాము సిద్ధమేనని హరీశ్రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి




