Kadiyam Srihari | వేల ఎకరాలు కబ్జా చేసి.. సిగ్గు లేకుండా అరుస్తున్నారు : కడియం శ్రీహరి
Kadiyam Srihari | బీఆర్ఎస్ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకుని వందల వేల ఎకరాలు కబ్జా చేసి.. ఇవాళ శాసనసభలో సిగ్గు లేకుండా అరుస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు.
Kadiyam Srihari | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకుని వందల వేల ఎకరాలు కబ్జా చేసి.. ఇవాళ శాసనసభలో సిగ్గు లేకుండా అరుస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే.. దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి శాసనసభా వేదికగా ప్రకటించారు.
తదనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో అనేక రకాల భూకబ్జాలు జరిగాయి. భూ దోపిడీ జరిగింది. ధరణిని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న నేతలు వందల వేల ఎకరాల భూకబ్జాలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని బాలానగర్లో భూ బదలాయింపులు చేశారు. దానిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. మేం కూడా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
దొంగతనం చేసిన వారు ఏ రకంగా బాధపడుతున్నారో చూడండి. ధరణిని అడ్డు పెట్టుకుని వందల ఎకరాలు కబ్జా చేసి సిగ్గు లేకుండా అరుస్తున్నారు. బాలాగనర్లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారని సీఎం చెప్పారు. హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసరికి సిగ్గు లేకుండా అరుస్తున్నారు. నిజాయితీ ఉంటే, ఎలాంటి తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని కడియం డిమాండ్ చేశారు.
దయచేసి మీరు(స్పీకర్ను ఉద్దేశించి) తక్షణమే హౌజ్ కమిటీ వేయాలి. సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసనసభ్యులమని మరిచి అరుస్తున్నారు. ఇది సభా సంప్రదాయాలకు మంచిది కాదు. సీఎం చెప్పినట్లు హౌస్ కమిటీకి అనుమతి ఇవ్వాలి అని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
వివాదానికి కారణమైన కడియం శ్రీహరి స్పీచ్ ఇదే pic.twitter.com/qt2Izz0V23
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



