త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్

Adluri Laxman Kumar | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

S

Telangana | Published On Aug 22, 2026, 10.03 pm IST

Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్
Advertisement

Adluri Laxman Kumar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన మంత్రి అడ్లూరి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మ‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కొండా సురేఖను సోదరిలా భావిస్తున్నానని, ఆమె కుమార్తె ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు మార్పు కోసం అవకాశం ఇచ్చారన్న అంశాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

పార్టీ అంతర్గత విభేదాలను మీడియా ముందు కాకుండా పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డిని మెజార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నార‌న్న అంశం మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. కాబ‌ట్టి పార్టీ నిర్ణ‌యాలు, నిబంధ‌న‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటులో ప్ర‌ధాన పాత్ర పోషించింద‌ని తెలిపారు. ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేని త‌న‌ను మంత్రిగా, సామాన్య కార్య‌క‌ర్త అయిన వెడ్మా బొజ్జును పార్టీ ఎమ్మెల్యేగా చేసింద‌ని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement