త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kothagudem | కొత్త‌గూడెంలో అర్ధ‌రాత్రి భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం

Kothagudem | భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో (Kothagudem) స్వ‌ల్ప భూకంపం (Earthquake) వ‌చ్చింది. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత 2.26 గంట‌ల స‌మయంలో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి.

G

Telangana | Published On Jun 14, 2026, 6.09 am IST

Kothagudem | కొత్త‌గూడెంలో అర్ధ‌రాత్రి భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం
Advertisement

Kothagudem | త్రినేత్ర‌.న్యూస్‌: భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో (Kothagudem) స్వ‌ల్ప భూకంపం (Earthquake) వ‌చ్చింది. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత 2.26 గంట‌ల స‌మయంలో పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.8గా న‌మోద‌యింది. భూమి అంత‌ర్భాగంలో 10 కిలోమీట‌ర్ల లోతులో క‌ద‌లిక‌లు సంభ‌వించాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రికి 11 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (NCS) తెలిపింది. మంచి నిద్ర‌లో ఉండ‌గా భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఇండ్లలో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. భూకంపం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టానికి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement