Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు
Accident | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ఎండోక్రినాలజిస్ట్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సుచియాష్కీకి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Accident | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ఎండోక్రినాలజిస్ట్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సుచియాష్కీకి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో చేర్పించిన అనంతరం కుటుంబం తిరుగు ప్రయాణంలో న్యూయార్క్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచియాష్కీ వేర్వేరు వాహనాల్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. కుమార్తె డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇటీవల కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కుమార్తెను ఎండీ కోర్సులో చేర్పించే కార్యక్రమం అనంతరం గురువారం ఆయన భారత్కు తిరిగి రావాల్సి ఉండగా.. ఈ ప్రమాదం జరిగింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
- ●KTR | హరీశ్రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
- ●Kunamneni | పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే: కూనంనేని సాంబశివరావు
- ●Ramakrishna | పవన్ కల్యాణ్ హుందాగా వ్యవహరించాలి.. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
- ●Harish Rao | యూకేలో హరీశ్రావు జన్మదిన వేడుకలు

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్

KTR | హరీశ్రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

Kunamneni | పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే: కూనంనేని సాంబశివరావు



