త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | నేడు కేసీఆర్‌ను క‌లువ‌నున్న జీవ‌న్‌రెడ్డి.. పార్టీలో చేరిక‌పై స్ప‌ష్ట‌త‌

Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నేత టీ.జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను (KCR) క‌లువనున్నారు. శుక్ర‌వారం ఉద‌యం ఎర్ర‌వెల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ కానున్నారు.

G

Telangana | Published On Apr 10, 2026, 8.48 am IST

Jeevan Reddy | నేడు కేసీఆర్‌ను క‌లువ‌నున్న జీవ‌న్‌రెడ్డి.. పార్టీలో చేరిక‌పై స్ప‌ష్ట‌త‌
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నేత టీ.జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను (KCR) క‌లువనున్నారు. శుక్ర‌వారం ఉద‌యం ఎర్ర‌వెల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ కానున్నారు. కాగా, గురువారం జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డిని క‌లిసిన బీఆర్ఎస్‌ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆయ‌న‌ను పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ను క‌లిసిన త‌ర్వాత పార్టీలో చేరిక‌కు సంబంధించిన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని జీవ‌న్ రెడ్డి తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్‌తో జీవ‌న్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఆయ‌న‌తోపాటు కేటీఆర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌, దామోద‌ర్ రావు, కొప్పుల ఈశ్వ‌ర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా నాయ‌కులు కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు.

 

కేసీఆర్‌తో జీవ‌న్ రెడ్డి నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా స్నేహం

జ‌గిత్యాలలోని జీవ‌న్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్‌.. ఆయ‌న పార్టీలోకి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో జీవ‌న్ రెడ్డికి ఉన్న స్నేహం ఈ రోజుది కాద‌న్నారు. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా స్నేహం ఉంది. 2014లో కేసీఆర్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచే అధికారిక ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంది. ఇక్క‌డే ఒక ఆడిటోరియంలో మీటింగ్ జ‌రిగింది. సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌తిపక్ష నేత జీవ‌న్ రెడ్డికి మైక్ ఇవ్వాల‌ని కేసీఆర్ చెప్పారు. ఇక అభినంద‌న‌లు చెప్పిన జీవ‌న్ రెడ్డి.. మీరు గ‌వ‌ర్న‌మెంట్‌లో ఉన్నారని చెప్పి.. జ‌గిత్యాల ప్ర‌జ‌ల త‌ర‌పున బోర్న‌ప‌ల్లి గ్రామానికి బ్రిడ్జి కావాల‌ని అడిగారు.

కేసీఆర్ దాట‌వేయ‌కుండా.. జీవ‌న్ రెడ్డి మీదున్న గౌర‌వంతో, ప్రేమ‌తో క్ష‌ణంలోనే రూ. 75 కోట్లతో బ్రిడ్జిని మంజూరు చేశారు. ఇంకో సంద‌ర్భం గుర్తుకు వ‌స్తుంది. రైతుల గురించి గ‌ట్టిగా మాట్లాడే నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి. నిజాం షుగ‌ర్స్ ఇంపార్టెంట్ స‌బ్జెక్టు.. తెరిపించాల‌ని కొట్లాడేవారు. తెరిపిస్తాం కానీ.. మ‌హారాష్ట్ర‌లో స‌హ‌కార వ్య‌వ‌స్థ‌లో అక్క‌డ షుగ‌ర్ మిల్లులు బ్ర‌హ్మాండంగా న‌డుస్తున్నాయి. కోఆప‌రేటివ్ సిస్ట‌మ్ అమ‌లు చేస్తే బాగుంటుంద‌ని నిండు శాస‌న‌స‌భ‌లో జీవ‌న్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. ప్ర‌భుత్వం రూ. 300 కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.. మీరు చైర్మ‌న్‌గా ఉండాల‌ని కేసీఆర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement