త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | బీఆర్ఎస్‌లో చేరికతో నూతన అధ్యాయం మొదలు కాబోతున్న‌ది: జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో త‌న చేరిక‌తో ఒక నూత‌న అధ్యాయం మొద‌లు కాబోతున్న‌ద‌ని సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. కేసీఆర్‌తో త‌న‌కున్న‌ అనుబంధం ఈనాటిది కాద‌ని చెప్పారు.

G

Telangana | Published On Apr 14, 2026, 11.45 am IST

Jeevan Reddy | బీఆర్ఎస్‌లో చేరికతో నూతన అధ్యాయం మొదలు కాబోతున్న‌ది: జీవ‌న్‌రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ పార్టీలో త‌న చేరిక‌తో ఒక నూత‌న అధ్యాయం మొద‌లు కాబోతున్న‌ద‌ని సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. కేసీఆర్‌తో త‌న‌కున్న‌ అనుబంధం ఈనాటిది కాద‌ని చెప్పారు. తాను ప్రజా జీవితంలోకి రాక ముందు నుంచే కేసీఆర్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా త‌నుకు పరిచయం ఉందన్నారు. 1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంలో తాము క‌లిసి ప‌నిచేశామ‌ని వెల్ల‌డించారు.

త‌దుప‌రి కాలంలో రాజ‌కీయంగా భిన్నాభిప్రాయాల‌తో వేర్వేరు పార్టీల్లో వేదిక‌లు పంచుకున్నామ‌ని తెలిపారు. భావాలు ఒక్క‌టైన‌ప్ప‌టికీ భిన్న వేదిక‌ల్లో కొన‌సాగామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మం, ఉద్య‌మ ర‌థ‌సార‌ధిగా కేసీఆర్‌కు యావ‌త్ తెలంగాణ అండ‌గా నిలిచింద‌ని చెప్పారు. 2006, 2008లో కేసీఆర్‌కు ప్ర‌త్య‌ర్థిగా ఎన్నిక‌ల్లో పోటీశా. రాజ‌కీయ పార్టీ ప్ర‌తినిధిగానే ఆయ‌న‌పై పోటీచేశానే త‌ప్ప ఆయ‌న‌ప‌ట్ల గానీ, తెలంగాణ ప‌ట్ల భిన్నాభిప్రాయాల‌తో కాదు. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ కూడా చెబుతుంటార‌ని జీవన్ రెడ్డి అన్నారు. ఈ నెల 20న జ‌గిత్యాల‌లో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ వేదిక‌గా కేసీఆర్ స‌మ‌క్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేర‌నున్నారు. మేడిగడ్డను సాకుగా చూపెట్టి కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టాలని చూశారని విమ‌ర్శించారు. మూడేండ్లు గడిచే సరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నాడు.. అందుకే గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నాడ‌ని తెలిపారు. రేపు కరువు వస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీయే దానికి కారణ‌మ‌ని చెప్పారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement