త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు.. యూత్ కాంగ్రెస్ నేత‌ల‌కు కేటీఆర్ చుర‌క‌

KTR | భార‌త్‌, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో జ‌రిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ (India AI Impact Summit)లో యూత్ కాంగ్రెస్ నేత‌లు నిర‌స‌న తెల‌ప‌డంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవ‌ని మండిపడ్డారు.

G

Telangana | Published On Feb 21, 2026, 12.02 pm IST

KTR | అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు.. యూత్ కాంగ్రెస్ నేత‌ల‌కు కేటీఆర్ చుర‌క‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త్‌, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో జ‌రిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ (India AI Impact Summit)లో యూత్ కాంగ్రెస్ నేత‌లు నిర‌స‌న తెల‌ప‌డంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవ‌ని మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రాజ‌కీయ అస‌మ్మ‌తిని వ్య‌క్తం చేయ‌డానికి ఒక స‌మ‌యం, సంద‌ర్భం ఉంటాయంటూ ఎక్స్ వేదిక‌గా సూచించారు.

‘అంతర్జాతీయ వేదికల‌పై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ నేత‌లు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను వేదికగా ఎంచుకోవడం విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు భార‌త్‌ ప్రతిష్ట దెబ్బతింటుంది.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. ఏఐ సమ్మిట్ వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సులో ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement