త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | ఆ మూడు ప్ర‌త్యేక రైళ్లు.. ఇక సాధార‌ణ రైళ్లు..

Indian Railways | ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియ‌న్ రైల్వేస్( Indian Railways ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మూడు ప్ర‌త్యేక రైళ్ల‌ను సాధార‌ణ రైళ్లుగా మార్చుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మూడు కూడా హైద‌రాబాద్( Hyderabad ) నుంచి రాక‌పోక‌లు సాగిస్తున్నాయి.

S

Telangana | Published On Mar 13, 2026, 6.35 pm IST

Indian Railways | ఆ మూడు ప్ర‌త్యేక రైళ్లు.. ఇక సాధార‌ణ రైళ్లు..
Advertisement

Indian Railways | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియ‌న్ రైల్వేస్( Indian Railways ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మూడు ప్ర‌త్యేక రైళ్ల‌ను సాధార‌ణ రైళ్లుగా మార్చుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మూడు కూడా హైద‌రాబాద్( Hyderabad ) నుంచి రాక‌పోక‌లు సాగిస్తున్నాయి.

కాచిగూడ - మ‌ధురై స్పెష‌ల్‌(07191/07192) ను కాచిగూడ - ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్‌(17165/17166) గా మార్చారు. ఈ రైలు ప్ర‌తి సోమ‌వారం కాచిగూడ‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి, మంగ‌ళ‌వారం రాత్రికి ట్యుటికోరిన్‌కు చేరుకోనుంది. మ‌ళ్లీ బుధ‌వారం ఉద‌యం కాచిగూడ‌కు బయ‌ల్దేర‌నుంది.

అదే విధంగా హైద‌రాబాద్ - క‌న్యాకుమారి స్పెష‌ల్‌ (07230/07229) ను హైద‌రాబాద్ - క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ (17069/17070) గా మార్చిన‌ట్లు ఇండియ‌న్ రైల్వేస్ ప్ర‌క‌టించింది. వారానికోసారి రెండు సిటీల మ‌ధ్య రాక‌పోక‌లు కొనసాగించ‌నుంది.

చ‌ర్ల‌పల్లి - షాలిమార్ స్పెషల్‌ (07225/07226) ను చ‌ర్ల‌ప‌ల్లి - షాలిమార్ అమృత్ భార‌త్ ఎక్స్‌ప్రెస్‌(17065/17066) గా మార్చారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం ఉద‌యం చ‌ర్ల‌ప‌ల్లి నుంచి బ‌య‌ల్దేరి బుధ‌వారం షాలిమార్ చేరుకోనుంది.

2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ రైల్వేస్ 91 కొత్త రైలు స‌ర్వీసుల‌ను హైద‌రాబాద్ కేంద్రంగా న‌డుపుతోంది. హైద‌రాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి రాక‌పోక‌లు సాగిస్తున్నాయి.

Advertisement
Advertisement