త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | కొత్వాల్‌గూడ‌లో మంత్రి పొంగులేటి క్రషర్ మిషన్లను కూల్చివేసిన హైడ్రా.. వీడియో

HYDRAA | శంషాబాద్ కొత్వాల్‌గూడ‌లో క్ర‌ష‌ర్ మిష‌న్ల‌ను హైడ్రా (HYDRAA) కూల్చివేసింది. ఎలాంటి అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా న‌డుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) చెందిన క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు.

G

Telangana | Published On May 5, 2026, 9.30 am IST

HYDRAA | కొత్వాల్‌గూడ‌లో మంత్రి పొంగులేటి క్రషర్ మిషన్లను కూల్చివేసిన హైడ్రా.. వీడియో
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ‌లో క్ర‌ష‌ర్ మిష‌న్ల‌ను హైడ్రా (HYDRAA) కూల్చివేసింది. ఎలాంటి అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా న‌డుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) చెందిన క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. గ‌త అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్‌ రావు రాఘ‌వా కన్‌స్ట్ర‌క్ష‌న్స్ అక్ర‌మాల‌పై చేసిన ఆరోపణలతో ప్రభుత్వం డైలమాలో ప‌డిన విష‌యం తెలిసిందే. త‌ప్పు జ‌రిగింద‌ని గ్రహించిన కాంగ్రెస్‌ సర్కారు వాటిని కూల్చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులోభంగా మంత్రి పొంగులేటిని ఒప్పించిన ప్ర‌భుత్వం.. తాజాగా కూల్చివేత‌లు చేప‌ట్టింది. దీంతో సీఎం తీరుపై పొంగులేటి అసహనం వ్య‌క్తం చేస్తున్నారు.

కొత్వాల్‌గూడలో ఉన్న క్రషర్ల చుట్టూ వివాదాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. జీవో నంబర్‌ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వా కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ క్రషర్లను నడుపుతున్న‌దని హ‌రీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఆధారాల‌తో స‌హా నిరూపించాయి. హిమాయత్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఆ కంపెనీ ఫైన్ కూడా చెల్లించింద‌ని ప్ర‌భుత్వం వెనుకేసుకొచ్చింది.

అయితే విప‌క్షాలు, స్థానికుల తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం చెల‌రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది.

 

Advertisement
Advertisement