త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | జూన్ 3 వ‌ర‌కు ఎండ‌లు త‌ప్ప‌వు.. ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్..!

Heat Wave | రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎండ‌ల‌తో పాటు వ‌డ‌గాల్పుల తీవ్ర‌త కూడా కొన‌సాగుతోంది. దీంతో జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

S

Telangana | Published On May 31, 2026, 6.25 am IST

Heat Wave | జూన్ 3 వ‌ర‌కు ఎండ‌లు త‌ప్ప‌వు.. ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్..!
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎండ‌ల‌తో పాటు వ‌డ‌గాల్పుల తీవ్ర‌త కూడా కొన‌సాగుతోంది. దీంతో జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జూన్ 3వ తేదీ వ‌ర‌కు కూడా ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతుంద‌ని హైదరాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు రోజుల పాటు 41 నుంచి 44 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని హెచ్చ‌రించింది.

31వ తేదీన 28 జిల్లాలు, జూన్‌ ఒకటిన 11 జిల్లాలు, రెండున 12, మూడో తేదీన 17 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం 45.3, ములుగు జిల్లా మంగపేట 45.2, నిర్మల్‌ జిల్లా మామడ 45.2, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) మండలంలో 45 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

Advertisement
Advertisement