Revanth Reddy | తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరు చేయండి: రేవంత్రెడ్డి
Revanth Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) సైనికాధికారులను కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” నిర్వహించారు.
Revanth Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) సైనికాధికారులను కోరారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూల్స్ మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో గత పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” నిర్వహించారు. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై వారు చర్చించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో నేవీకి చెందిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్కు మూడు వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరచర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా (తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



