త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | ప్ర‌జ‌ల సొంతింట క‌ల నెర‌వేర‌డం అత్యంత తృప్తినిస్తుంది: ఎంపీ చామ‌ల‌

Chamala Kirankumar Reddy | పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం, వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటం అత్యంత తృప్తినిచ్చే విషయమ‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jun 1, 2026, 2.36 pm IST

Chamala Kirankumar Reddy | ప్ర‌జ‌ల సొంతింట క‌ల నెర‌వేర‌డం అత్యంత తృప్తినిస్తుంది: ఎంపీ చామ‌ల‌
Advertisement
  • ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టువ‌స్త్రాలు బ‌హూక‌రించిన చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం, వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటం అత్యంత తృప్తినిచ్చే విషయమ‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతన ఇందిరమ్మ గృహాల్లోకి అడుగుపెడుతున్న కుటుంబాలన్నింటికీ శుభం జరగాలని కోరారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం సోమ‌వారం అత్యంత వైభవంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు.

ఈ శుభ కార్యక్రమానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ సభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సంప్రదాయబద్ధంగా లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను సమర్పించారు‌. ఈ కార్యక్రమంలో జిల్లా క‌లెక్ట‌ర్‌ అనురాగ్ జయంతి, భువనగిరి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement