త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kondagattu | సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. కొండగ‌ట్టు హుండీలో లేఖ‌

Kondagattu | సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. ఇది సామాన్య భ‌క్తుడి ఆక్రోశం. ఓ ఆల‌యం హుండీలో డ‌బ్బుల‌కు బదులు లేఖ (Protest Letters) ల‌భించింది. అందులో ఓ భ‌క్తుడు అధికారుల‌ను వేసిన ప్ర‌శ్న ఇది.

G

Telangana | Published On Apr 20, 2026, 5.42 am IST

Kondagattu | సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. కొండగ‌ట్టు హుండీలో లేఖ‌
Advertisement

Kondagattu | త్రినేత్ర‌.న్యూస్‌: సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. ఇది సామాన్య భ‌క్తుడి ఆక్రోశం. ఓ ఆల‌యం హుండీలో డ‌బ్బుల‌కు బదులు లేఖ (Protest Letters) ల‌భించింది. అందులో ఓ భ‌క్తుడు అధికారుల‌ను వేసిన ప్ర‌శ్న ఇది.

రాష్ట్రంలోని హ‌నుమాన్ ఆల‌యం కొండ‌గ‌ట్టులో (Kondagattu) ఆంజ‌నేయ‌స్వామి చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 16 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు పెద్దఎత్తున భక్తులు, మాలధారులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్యా ఆలయ ప్రాంగణంలో అధికారులు 14 హుండీలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ సంద‌ర్భంగా నగదుతో పాటు ఏర్పాట్ల‌పై అసంతృప్తితో భ‌క్తులు రాసిన లేఖ‌లు పదుల సంఖ్యలో బయటపడ్డాయి.

వేలాది మంది వచ్చే చోట కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని, ఆలయ ప్రాంగణం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, కనీస వసతులు లేని వాష్ రూమ్స్ వల్ల మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తున్న‌దని, అక్కడ కూడా కనీస వసతులు ఏర్పాటు చేయ‌లేద‌ని లేఖ‌ల్లో మండిప‌డ్డారు. ఆల‌యానికి వ‌చ్చే ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు? అని అధికారుల‌ను నిల‌దీశారు. ముందు వసతులు మెరుగుపరచండి.. ఆ తర్వాతే హుండీలో కానుకలు వేస్తాం! అంటూ మండిప‌డ్డారు. దీంతో అధికారులు ఖంగుతున్నారు. కొండ‌గ‌ట్టులో వ‌స‌తుల‌పై ప్ర‌భుత్వం, అధికారులు ఇప్ప‌టికైనా మేల్కొన‌క‌పోతే భ‌క్తుల ఆగ్ర‌హం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement