త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రేపు భూపాల‌ప‌ల్లి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌

CM Revanth Reddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.

P

Telangana | Published On Apr 19, 2026, 7.12 pm IST

CM Revanth Reddy | రేపు భూపాల‌ప‌ల్లి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ త‌ర్వాత సీఎం మేడిగడ్డకు చేరుకుని డ్యామ్ సైట్‌ను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మేడిగడ్డ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నేరుగా కాటారం మండలం నస్తురపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుంటారు. ఈ సభ వేదికగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

Advertisement
Advertisement