త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodangal Congress Rally | మోదీని గద్దె దించాలె.. రాహుల్‌ను ప్రధానిని చేయాలె

నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీపై పోలీసుల దాడిని నిరసిస్తూ కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. కేటీఆర్ బినామీ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Jul 22, 2026, 4.25 pm IST

Kodangal Congress Rally | మోదీని గద్దె దించాలె.. రాహుల్‌ను ప్రధానిని చేయాలె
Advertisement
  • ఢిల్లీలో రాహుల్ గాంధీ, నిరసనకారులపై పోలీసుల దాడిని ఖండిస్తూ కొడంగల్‌లో సీఎం రేవంత్ భారీ ర్యాలీ
  • దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా గాంధీ కుటుంబానికి రక్తం చిందించడం కొత్తేమీ కాదన్న రేవంత్
  • నీట్ లీక్ వెనుక కేటీఆర్ బినామీ సంస్థ 'గ్లోబరీనా' హస్తం ఉందంటూ సీఎం సంచలన ఆరోపణలు
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్

Kodangal Congress Rally | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్‌పై శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై జరిగిన పోలీసుల దాడిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి నిరసనగా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బుధవారం ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా సీఎం సంచలన ఆరోపణలు చేశారు.

CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally

నిరసన తెలిపితే పాశవిక దాడులా?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేసి.. పేపర్ లీక్ చేసిన వారిని జైలుకు పంపాల్సిన కేంద్ర ప్రభుత్వం.. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థుల తలలు పగలగొట్టడం దారుణమని సీఎం మండిపడ్డారు. విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీపై పోలీసులు పాశవికంగా వ్యవహరించారని, ఈ దాడిలో ఆయన రక్తం నేలకు చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ కుటుంబానికి రక్తం చిందించడం కొత్తేమీ కాదన్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం క‌ల్పించిన నిర‌స‌న హ‌క్కును కేంద్రం కాల‌రాస్తోంద‌ని ఆయన విమర్శించారు.

CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally

నీట్ లీక్ వెనుక కేటీఆర్ బినామీ సంస్థ

ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) మధ్య ఉన్న సంబంధాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో ఇంటర్ ఫలితాల అవకతవకలతో 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న 'గ్లోబరీనా' (Globarena) సంస్థ కేటీఆర్ బినామీదేనని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావడంతో, పప్పులు ఉడకవని ఆ సంస్థ Coempt Education గా పేరు మార్చుకుని ఢిల్లీకి చెక్కేసిందన్నారు. అక్కడి బీజేపీ నేతలతో కుమ్మక్కై ఏకంగా నీట్ (NEET) పరీక్ష నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకుందని సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర(PM Modi), ధర్మేంద్ర (Dharmendra Pradhan) ఇద్దరూ కలిసి ఇలా దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally

కొడంగల్‌లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

ఉదయం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్రగా వెళ్లారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి ఫొటోలతో కూడిన భారీ బ్యానర్‌తో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరం కలిసి పోరాటం చేసి మోదీ సర్కార్‌ను గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుందామని ఈ సందర్భంగా క్యాడర్‌కు సీఎం పిలుపునిచ్చారు.

CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally CM Revanth Reddy Slams Modi and KTR Over NEET Paper Leak in Kodangal Rally

Advertisement
Advertisement