త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా పనిచేస్తున్నాం: సీఎం రేవంత్‌

Revanth Reddy | ఆర్ధిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పని చేస్తున్న‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

G

Telangana | Published On Apr 2, 2026, 11.08 am IST

Revanth Reddy | సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా పనిచేస్తున్నాం: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్ధిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పని చేస్తున్న‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయ్యింద‌ని చెప్పారు. తాము పాలకులం కాదు.. సేవకులం అనే భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామ‌ని తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు.

`ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్ధతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం.

ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన - ప్రగతిప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి.

మహాలక్ష్మి.. ఉచిత బస్సుసౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి.

`తెలంగాణ రైజింగ్ – 2047` విజన్‌తో ఆర్థికంగానే కాక, అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. CURE, PURE, RAREగా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి.

ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు.. ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై.. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి.` అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement