త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్రంలోని విద్యార్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. ఇక ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. విద్యార్థులెవ‌రూ కూడా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

S

Telangana | Published On Aug 14, 2026, 5.47 pm IST

CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని విద్యార్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. ఇక ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. విద్యార్థులెవ‌రూ కూడా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. నెక్లెస్ రోడ్‌లో మ‌హాత్మా జ్యోతిబాపూలే దంప‌తుల విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో రేవంత్ ప్ర‌సంగించారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఈ ఏడాది నుంచి అడ్వాన్స్‌డ్‌గా బ్యాంకు ఖాతాల్లో పెడుతున్నాం. ప్ర‌తి ఏడాది 2,400 కోట్లు అడ‌క్క‌ముందే మీ ఖాతాల్లో వేస్తాం. విద్యార్థులెవ‌రూ కూడా ఎవ‌రి ద‌గ్గ‌ర చేయి చాచాల్సిన అవ‌స‌రం లేదు. పార‌ద‌ర్శ‌కంగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తాం. ప్ర‌తి ఏడాది 2,300 కోట్ల రీయింబ‌ర్స్‌మెంట్ విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకి న‌గ‌దు బ‌దిలీ చేస్తాం. ఈ విద్యా సంవ‌త్స‌రం రూ. 250 కోట్లు అడ్వాన్స్‌డ్‌గా భ‌ట్టి విక్ర‌మార్క‌ పెట్టారు. విద్యార్థులు కాలేజీల్లో ప్ర‌వేశాలు పొందిన త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకుంటే నెల‌లోనే మీ ఫీజు ఖాతాలో ప‌డుతుంది. ఇక భ‌విష్య‌త్‌లో ఏ కాలేజీ కూడా ఫీజులు క‌ట్ట‌లేద‌ని స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌మ‌ని చెప్పే అవ‌కాశం ఇవ్వం. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను సంపూర్ణంగా అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement