త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆ రెండు కేసుల్లో.. నాంప‌ల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం హాజ‌ర‌య్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.

S

Telangana | Published On Feb 28, 2026, 6.49 pm IST

CM Revanth Reddy | ఆ రెండు కేసుల్లో.. నాంప‌ల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం హాజ‌ర‌య్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.

2019లో జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక‌ ప్రచారంలో భాగంగా అప్పటి ఎంపీ అయిన రేవంత్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున భారీ ర్యాలీ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ర్యాలీలో 40 కార్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లతో ప్రచారం నిర్వహించారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

2021లో కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారని రేవంత్‌‌పై ఆరోపణలు ఉన్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ప్రజా సమావేశాలపై పరిమితులు ఉన్నా వాటిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఎలక్షన్ సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, కోవిడ్ మార్గదర్శకాలు పాటించకపోవడం వంటి అంశాలపై కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణలో భాగంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఎదుట రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ కోర్టుకు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement