త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medigadda Barrage | మేడిగడ్డను వెంటనే పునరుద్ధరించండి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం బ్యారేజీని పలుమార్లు పరిశీలించి.. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్‌ని వెంటనే పునరుద్ధరించాలని అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గుర్తు చేశారు. 

J

Telangana | Published On Jan 29, 2026, 7.35 pm IST

Medigadda Barrage | మేడిగడ్డను వెంటనే పునరుద్ధరించండి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు
Advertisement
  • దేశంలో ప్రమాదకర స్థితిలో ఉన్న మూడు డ్యామ్‌ల జాబితా విడుదల
  • మేడిగడ్డ సహా యూపీ, జార్ఖండ్ డ్యామ్‌లకు 'కేటగిరీ-1' ముప్పు
  • తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని NDSA సూచన: కేంద్ర మంత్రి రాజ్ భూషణ్

Medigadda Barrage | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం సంచలన విషయాలను వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉందని, అది 'కేటగిరీ-1' (Category-1) జాబితాలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ లోక్‌సభ సాక్షిగా స్పష్టం చేసింది. వెంటనే మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం బ్యారేజీని పలుమార్లు పరిశీలించి.. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్‌ని వెంటనే పునరుద్ధరించాలని అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గుర్తు చేశారు. లోక్‌సభలో దేశవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ల సేఫ్టీ (Dam Safety), నిర్వహణపై అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రమాదంలో ఉన్న డ్యామ్‌లు ఇవే..

దేశంలోని మూడు డ్యామ్‌లు/బ్యారేజీలు తీవ్రమైన లోపాలతో ప్రమాదకర స్థితిలో ఉన్నాయని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. అవి మేడిగడ్డ బ్యారేజీ (తెలంగాణ), లోయర్ కజూరి డ్యామ్ (ఉత్తరప్రదేశ్), బొకారో బ్యారేజీ (జార్ఖండ్). ఈ మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం స్ట్రక్చరల్ పరంగా రిస్క్‌లో ఉన్నాయని, వీటి వల్ల ప్రమాదం పొంచి ఉందని కేంద్రం తెలిపింది.

NDSA హెచ్చరికలు - చర్యలు

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఇప్పటికే 'నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ' (NDSA) నిపుణుల బృందం పలుమార్లు పరిశీలించి నివేదికలు ఇచ్చిన విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు (Risk Reduction), బ్యారేజీని సురక్షితంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై NDSA స్పష్టమైన సూచనలు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ డ్యామ్‌ల వద్ద 'సేఫ్ ఆపరేషన్స్' (సురక్షిత నిర్వహణ) కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, NDSA సిఫార్సులను పాటించాలని కేంద్రం ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, భద్రతపై నెలకొన్న సందిగ్ధత నడుమ కేంద్రం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement