త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 80 – 90 శాతం గెలిస్తేనే గెలిచిన‌ట్టు.. లేక‌పోతే అదేం గెలుపు..! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

KTR | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ 80-90 శాతం గెలిస్తేనే గెలిచిన‌ట్టు లేక‌పోతే అది ఏం గెలుపు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Feb 13, 2026, 6.42 pm IST

KTR | 80 – 90 శాతం గెలిస్తేనే గెలిచిన‌ట్టు.. లేక‌పోతే అదేం గెలుపు..! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ 80-90 శాతం గెలిస్తేనే గెలిచిన‌ట్టు లేక‌పోతే అది ఏం గెలుపు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నిక‌లు స్థానికంగానే కొట్లాడుతాం అని చెప్పాం. రాజకీయాల్లో ఎప్పుడూ లోకల్ బాడీస్ అనేది ప్రభుత్వానికి వన్ సైడ్‌గా అంటే అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు వన్ సైడ్ ఎలక్షన్స్ జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ‌లోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల ఫ‌లితాల‌పై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ మా తమ్ముళ్లకి, మా చెల్లెళ్లకి అందరికీ పేరుపేరునా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రవ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలవడంలో విఫలమయ్యారు. పంచాయతీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో రెండు మూడేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ప్రజల్లో కనపడతున్నది. దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్లయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40 శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. 4000 పైచిలుకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు.

మెరుగైన ఫ‌లితాలే సాధించాం..

ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్‌గా గతంలో ఎవరెవరైతే ఏదో మాట్లాడినారో వారందరి నోళ్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్ పర్సన్లకు ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్టుగా 122 గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ నాలుగు గెలిచింది, బిజెపి రెండు గెలిచింది, ఎంఐఎం రెండు గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈ రోజు ఇప్పుడే నేను మీ ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్టుగా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతున్నాం. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10, 15 చోట్ల మాకు ఛాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే 117లో డెఫినెట్‌గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం

ఈ డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దుర్వినియోగం ఇవన్నీ కూడా పరాకాష్టకు చేరినాయి. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కాంగ్రెస్ బేరాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలయ్యాయి. మా దగ్గర గెలిచిన వాళ్లను లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూన్నారు. అయినా కూడా పర్వాలేదు కొట్లాడుదామ‌ని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాలి..

క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీలో సీపీఐ త‌మ‌కు మ‌ద్ద‌తునిచ్చి ప్ర‌చారంలో పాల్గొన‌డంతో ఆ మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం. కాంగ్రెస్, బీజేపీ క‌లిసి ప‌ని చేస్తున్నాయి కాబ‌ట్టి వారిని నిరోధించ‌డానికి సీపీఐ క‌లిసి వ‌స్తే వారిని కూడా క‌లుపుకున్నాం. సీపీఐ సెక్ర‌ట‌రీ సాంబ‌శివ‌రావుతో మాట్లాడాను. కొత్త‌గూడెంలో హంగ్ వ‌చ్చింది.. నేను ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే డెఫినెట్‌గా మేము మీతో కలిసి వస్తాము, కాంగ్రెస్ బిజెపిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51 శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉంది. 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బిజెపికి అందులో భాగస్వామ్యం ఉంది. సీపీఐ గనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాము ఓపెన్‌గా చెప్పడం జరిగింద‌ని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ నాయ‌క‌త్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ‌ర‌క్ష

రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పన్నినప్పటికీ బీఆర్ఎస్, కేసీఆర్ నాయ‌క‌త్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ‌ర‌క్ష అని చెప్పి మ‌ళ్లీ ప‌ట్ట‌ణాల్లో, ప‌ల్లెల్లో ప్ర‌జ‌లు తేల్చారు. ఇదే ఉత్సాహంతో హైద‌రాబాద్ కార్పొరేష‌న్ కానీ, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌, అలాగే జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు పెడితే వాటిలో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు పోతామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

30 హంగ్.. 15 మేం గెలిచాం..

రాష్ట్రంలో 124 చోట్ల ఎన్నికలు జరిగితే, 30 హంగ్ ఉన్నాయి, 15 మేము గెలిచినాం. అంటే 46 పోతే మిగతావి వాళ్ళు గెలిచారు. హంగ్ వచ్చిన చోట ఏ వైఖరి అవలంబించాలి అనేది కేసీఆర్‌తో కూడా మాట్లాడతాం. అట్లాగే స్థానిక నాయకత్వం మనోభావాలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. స్థానిక నాయకుల మనోభావాలు, స్థానికంగా ఏ పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీజు వేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా రెండు రోజుల టైం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారు..

నేను రాజు నేను మంత్రి అనుకున్న వాళ్ళని ఎంతో మందిని చూశాం. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు, పోతారు. ఎవరూ పర్మనెంట్ కాదు. నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలామంది అట్లాగే గాలికి కొట్టుకుపోయారు. ఈ దేశం చాలా గొప్ప దేశం, ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారు చాలా తెలివితక్కువ వాళ్ళు. ఈ దేశంలో ఇందిరా గాంధీ ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు. కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ఓటమి పాలయ్యారు. అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు, నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అంత న‌మ్మ‌క‌ముంటే ఉప ఎన్నిక‌ల‌కు పోదాం..

కానీ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే, ఆ పది మందితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు పోదాం. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. అక్కడ మురుగు నీరు బాగుందా, అక్కడ నీళ్ళు వస్తున్నాయా లేదా, అక్కడ అభ్యర్థి ఓడిపోయాడా గెలిచాడా వీటన్నిటి మీద నడుస్తుంది. రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి. ప్రజలు చెప్తారు, 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్‌గా అది ఒక ఇండికేటర్.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా స‌ఫ‌ల‌మ‌య్యాం..

ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తా ఉన్నాం. ప్రజల ఇష్యూస్‌ని ఎత్తుకోవడం, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో గానీ, మహిళల విషయంలో గానీ, యువకుల విషయంలో గానీ ప్రతి విషయంలో అందరికంటే అగ్రెసివ్‌గా ముందున్నది బిఆర్ఎస్ పార్టీ. కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అనేది ఆల్రెడీ బయట పడుతోందని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement