త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతుల కోసం ప‌దేండ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాం : కేటీఆర్

KTR | కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌దేండ్ల‌లో రైతుల కోసం రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ ఈ రెండున్న‌రేండ్ల‌లోనే రూ. 3 ల‌క్ష‌ల 72 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి.. రైతుల‌కు చేసిందేమీ లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On May 6, 2026, 5.14 pm IST

KTR | రైతుల కోసం ప‌దేండ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌దేండ్ల‌లో రైతుల కోసం రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ ఈ రెండున్న‌రేండ్ల‌లోనే రూ. 3 ల‌క్ష‌ల 72 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి.. రైతుల‌కు చేసిందేమీ లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. వ‌రంగ‌ల్ రైతు సంగ్రామ స‌ద‌స్సులో కేటీఆర్ ప్ర‌సంగించారు.

ఆ రోజుల్లో కాంగ్రెస్ హ‌యాంలో నెర్రెలుబారిన నేలలు, క‌రెంట్ కోత‌లు, దొంగ‌రాత్రి క‌రెంట్, పాముకాట్లు, ఎండిపోయిన పొలాలు, ఆక‌లి కేక‌లు.. ఆగ‌మైన తెలంగాణ‌ను బాగు చేయాల‌ని ప‌దేండ్లు ప్రాణం పెట్టి రైతుల కోసం కేసీఆర్ ప‌ని చేశారు. అద్భుత‌మైన ప‌థ‌కాల‌కు కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ తెలిపారు.

రైతుబంధు కోసం రూ. 73 వేల కోట్లు, రుణ‌మాఫీ కోసం రూ. 29 వేల కోట్లు, 24 గంట‌ల‌ క‌రెంట్ కోసం రూ. ల‌క్ష కోట్లు, కాళేశ్వ‌రం, పాల‌మూరు సీతారామ సాగునీటి ప్రాజెక్టుల కోసం ల‌క్షా 60 వేల కోట్లు, ధాన్యం కొనుగోళ్ల‌కు ల‌క్షా 32 వేల కోట్లు కేటాయించాం. ప‌దేండ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాం రైతుల కోసం. అందుకే దేశానికి అన్న‌పూర్ణ‌గా అవ‌త‌రించింది తెలంగాణ‌. కేసీఆర్ వ‌చ్చాక రైతుకు గుండె ధైర్యం పెరిగింది. ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.

కానీ రెండున్న‌రేండ్ల‌లో రూ. 3 ల‌క్ష‌ల 72 వేల కోట్లు అప్పు చేశారు. ఎవ‌ర్నీ ఉద్ద‌రిస్తున్నారు.. ప‌చ్చ‌గా ఉన్న తెలంగాణ‌లో చీడ పురుగుల్లా కాంగ్రెసోళ్లు వ‌చ్చారు. దేశం మొత్తం వ‌దిలించుకున్న పార్టీ కాంగ్రెస్. ఆత్మ‌హ‌త్య‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.. యూరియా ఇవ్వ‌డం లేదు.. తొక్కిస‌లాట‌లు, తోపులాట‌లు చోటు చేసుకున్నాయి. వెనుక‌టి రోజులు మ‌ళ్లీ తీసుకువ‌స్తాం అంటే మ‌ళ్లీ వ‌చ్చాయి. విత్త‌నాలు, యూరియా పోలీసు స్టేష‌న్‌లో పంచే రోజులు వ‌చ్చాయి. ఎంత మందికి యాప్ వాడే తెలివి ఉంది. ఈ రైతు వేదిక స‌దస్సుగా యాప్‌ల పేరిట జ‌రుగుత‌న్న నాట‌కాలు ర‌ద్దు చేసి య‌థావిధిగా షాపుల్లో యూరియా అందించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement