త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఎవ‌ర్నీ అడిగి హైద‌రాబాద్‌ను 3 కార్పొరేష‌న్లుగా విభ‌జించారు..! సీఎం రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌

KTR | డీలిమిటేష‌న్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ర్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పీర్జాదిగూడ‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్ త‌ర్వాత ఏఎన్ఐ, పీటీఐ వార్తాసంస్థ‌ల‌తో కేటీఆర్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

S

Telangana | Published On Apr 15, 2026, 4.08 pm IST

KTR | ఎవ‌ర్నీ అడిగి హైద‌రాబాద్‌ను 3 కార్పొరేష‌న్లుగా విభ‌జించారు..! సీఎం రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : డీలిమిటేష‌న్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ర్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పీర్జాదిగూడ‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్ త‌ర్వాత ఏఎన్ఐ, పీటీఐ వార్తాసంస్థ‌ల‌తో కేటీఆర్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

రేవంత్ రెడ్డి హైబ్రిడ్ సీఎం. ఆయ‌న కాంగ్రెస్, బీజేపీకి సీఎంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న హైబ్రిడ్ న‌మూనానే ఇస్తారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించిన స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ‌రితోనైనా మాట్లాడారా..? ఎవ‌ర్నీ అడిగి హైద‌రాబాద్‌ను మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించారని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు.

లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై కూడా కేటీఆర్ స్పందించారు. నిన్న ఎంపీల‌కు అంద‌జేసిన బిల్లు లోప‌భూయిష్టంగా ఉంది. ఆ బిల్లులో 50 శాతం ప్ర‌స్తావ‌న లేనే లేదు. కొత్త సీట్ల పెంపు కోసం జ‌నాభాను ప్ర‌తిపాదిక‌గా తీసుకుంటే.. ఆందోళ‌న క‌లిగించే విష‌యం. పార్ల‌మెంట్‌లో ద‌క్షిణ భార‌త‌దేశానికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దాన్ని కొన‌సాగించ‌క‌పోతే.. ద‌క్షిణ భార‌త‌దేశంలో అతిపెద్ద తిరుగుబాటు జ‌రుగుతద‌ని హెచ్చ‌రించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేటీఆర్ స్పందిస్తూ.. మా ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం. ఈ ప్ర‌తిపాద‌న‌కు మేం సంపూర్ణంగా మ‌ద్ద‌తు ఇస్తాం. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణకు, మహిళా రిజర్వేషన్‌కు ముడిపెట్టాల్సిన అస‌వ‌రం లేద‌ని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement