త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vakiti Srihari | చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: మంత్రి వాకిటి శ్రీహరి

Minister Vakiti Srihari | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మృగశిర కార్తిని వేడి తగ్గి వాతావరణం చల్లబడే కాలంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On Jun 6, 2026, 6.20 pm IST

Minister Vakiti Srihari | చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Minister Vakiti Srihari | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మృగశిర కార్తిని వేడి తగ్గి వాతావరణం చల్లబడే కాలంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన విడుదల చేసిన పాయింట్లలో, 176 సంవత్సరాలుగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని గుర్తుచేశారు. ఈ సంప్రదాయం ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిపారు.

ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో 1 లక్షా 35 వేల చేప పిల్లలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బత్తిని కుటుంబం అనవాయితీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి విభాగం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 8న రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని, 9వ‌ తేదీ అంతా కొనసాగుతుందని తెలిపారు. చివరి వ్యక్తి వరకు ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అధికారులు అక్కడే ఉంటారని స్పష్టం చేశారు. ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలకు నమ్మకంతో ఈ ప్రసాదాన్ని తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఆయాసం, ఉబ్బసానికి ఇది మంచి ఉపశమనం ఇస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఏ చిన్న అవసరం వచ్చినా అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement