Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు
ఉదయం కిచిడీ బండిపై తండ్రులకు సాయం.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
సంక్షిప్త సారాంశం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన బిలాల్, షకీబ్ అనే ఇద్దరు యువకులు నీట్ (NEET)లో సత్తా చాటారు. ఫుట్పాత్పై కిచిడీ అమ్ముకునే తమ తండ్రులకు సాయం చేస్తూనే, కష్టపడి చదివి ఎంబీబీఎస్ (MBBS) సీట్లు సాధించారు. బిలాల్కు నిర్మల్ మెడికల్ కాలేజీలో, షకీబ్కు కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో సీట్లు దక్కాయి. పేదరికాన్ని జయించి డాక్టర్లు కాబోతున్న ఈ యువకులను కలెక్టర్, మాజీ మంత్రులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.
Adilabad Khichdi Sellers Sons | త్రినేత్ర.న్యూస్ : 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు' అనే మాటకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు యువకులు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. పేదరికం వారి ఆశయాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఉదయం పూట రోడ్డుపై కిచిడీ అమ్ముతూ, రాత్రిళ్లు నిద్ర మానుకుని పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్షలో సత్తా చాటి ఏకంగా ఎంబీబీఎస్ (MBBS) సీట్లు సాధించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్లు అన్నదమ్ముల కొడుకులు. వీరు స్థానిక జడ్పీ స్కూల్ ముందు ఫుట్పాత్పై టిఫిన్ సెంటర్ (కిచిడీ బండి) నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆసిఫ్ కుమారుడు మహమ్మద్ బిలాల్, జావిద్ కుమారుడు మహమ్మద్ షకీబ్.. ఇద్దరూ చిన్నప్పటి నుంచే చదువులో చురుకు. ప్రభుత్వ పాఠశాలలోనే టెన్త్ వరకు చదివిన వీరు, స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. సెలవు దినాల్లో (Holidays), రద్దీగా ఉండే అంగడి రోజుల్లో తమ తండ్రులకు కిచిడీ బండి వద్ద చేదోడువాదోడుగా ఉండేవారు.

ఉదయం 3.30కే నిద్రలేచి..
వీరి దినచర్య తెల్లవారుజామున 3:30 గంటలకే మొదలవుతుంది. కిచిడీ తయారీలో తండ్రులకు సాయం చేసి, 5:30 గంటలకు నమాజ్ పూర్తి చేసుకుంటారు. ఉదయం 6 గంటలకల్లా టిఫిన్ బండి దగ్గర రెడీగా ఉంటారు. వ్యాపారం పూర్తయిన తర్వాత బయట ఎక్కడా తిరగకుండా, ఇంటికి వెళ్లి ఓ చిన్న గదిలో కూర్చుని నీట్ కోసం సీరియస్గా ప్రిపేర్ (Prepare) అయ్యారు. రెండేళ్ల పాటు వారు పడిన కష్టమే ఇప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది.
మెడికల్ కాలేజీల్లో సీట్లు
నీట్ (NEET) ఫలితాల్లో మహమ్మద్ బిలాల్ ఆల్ ఇండియా స్థాయిలో 1,20,325 ర్యాంక్ (స్టేట్ ర్యాంక్- 1788) సాధించగా, మహమ్మద్ షకీబ్ ఆల్ ఇండియా స్థాయిలో 1,47,283 ర్యాంక్ (స్టేట్ ర్యాంక్- 2583) సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ ఫేస్ (First phase) కౌన్సెలింగ్లోనే బిలాల్కు నిర్మల్ మెడికల్ కాలేజీలో, షకీబ్కు కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి.

ఇంద్రవెల్లిలో 'మామూ కీ కిచిడీ'గా పేరుగాంచిన జావిద్, ఆసిఫ్ల కొడుకులు డాక్టర్లు కాబోతుండటం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యువకులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రభుత్వ విప్ మహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు మైనార్టీ నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. గమ్యం చేరుకోవాలనే కసి ఉంటే.. ఫుట్పాత్పై కిచిడీ అమ్మే స్థాయి నుంచి స్టెతస్కోప్ పట్టుకునే స్థాయికి ఎదగవచ్చని ఈ యువకులు నిరూపించారు.

తాజావార్తలు
- ●Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్
- ●Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?
- ●CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..
- ●TOMCOM Overseas Jobs | విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ యువత కోసం 10 వేల ఓవర్సీస్ జాబ్స్
- ●Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ
- ●Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు

Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్

Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?

CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..

TOMCOM Overseas Jobs | విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ యువత కోసం 10 వేల ఓవర్సీస్ జాబ్స్



