త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | బూతులు మాట్లాడేవారితో చ‌ర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్దాం 

KCR | రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడు. ఆ బూతుల వీరుడు చర్చలకు అసెంబ్లీకి రమ్మంటున్నాడు. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు నేను అసెంబ్లీకి రావడం అవసరమా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 6.34 pm IST

KCR | బూతులు మాట్లాడేవారితో చ‌ర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్దాం 
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడు. ఆ బూతుల వీరుడు చర్చలకు అసెంబ్లీకి రమ్మంటున్నాడు. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు నేను అసెంబ్లీకి రావడం అవసరమా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను ప్ర‌శ్నించారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమై, అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ త‌న చావు కోరుతూ పదేపదే స్పీచ్లు ఇస్తున్నారు.. అసెంబ్లీకి రావాలని ధర్నాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన.. తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి కాదు.. ప్ర‌జ‌ల్లోకే వెళ్దామ‌ని సూచించారు. ల‌క్ష‌ మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దామ‌ని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement