ICC Men’s ODI World Cup | గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్ షురూ..
ICC Men's ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్లో మరో ప్రత్యేక సందర్భానికి రంగం సిద్ధమవుతోంది. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ను అక్టోబర్ 2న ప్రారంభించే ప్రతిపాదనను ఐసీసీ పరిశీలిస్తోంది. అదే రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కావడంతో.. ఆయనకు నివాళిగా మెగా టోర్నీని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
- అక్టోబర్ 2న ప్రారంభించేందుకు ఐసీసీ ఏర్పాట్లు
- మహాత్ముడికి ఘన నివాళులర్పించాలని యోచన
- సంయుక్త ఆతిథ్యంగా ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా
ICC Men's ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్లో మరో ప్రత్యేక సందర్భానికి రంగం సిద్ధమవుతోంది. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ను అక్టోబర్ 2న ప్రారంభించే ప్రతిపాదనను ఐసీసీ పరిశీలిస్తోంది. అదే రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కావడంతో.. ఆయనకు నివాళిగా మెగా టోర్నీని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈసారి ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
దక్షిణాఫ్రికాతో అనుబంధం..
దక్షిణాఫ్రికాతో గాంధీజీకి ఉన్న చారిత్రక అనుబంధం ఉండడంతో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 1893 నుంచి 1914 వరకు సుమారు 21 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో ఉన్న ఆయన.. అక్కడే వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. సత్యాగ్రహానికి కూడా అక్కడే పునాది పడింది. అనంతరం నెల్సన్ మండేలా వర్ణవివక్షపై సాగించిన పోరాటంతో గాంధీ సిద్ధాంతాలకు ఏర్పడిన చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. ఆయన జయంతి రోజున ప్రపంచకప్కు తెరతీయాలని ఆతిథ్య దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి.
14 జట్లతో పోరు
2027 ప్రపంచకప్లో గతంతో పోలిస్తే ఫార్మాట్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత ప్రపంచకప్లో 10 జట్లు బరిలోకి దిగగా.. ఈసారి 14 జట్లకు అవకాశం కల్పించనున్నారు. ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు తదుపరి ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. 2003 ప్రపంచకప్లో అమలు చేసిన విధానాన్ని మరోసారి తీసుకొస్తున్నారు. టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా చోటు దక్కనుండగా.. నమీబియా క్వాలిఫయింగ్ ప్రక్రియ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. మొత్తం 54 మ్యాచ్లను నిర్వహించనున్నారు. జోహన్నెస్బర్గ్, కేప్టౌన్, డర్బన్తో పాటు హరారే, విండ్హోక్ తదితర నగరాలు మ్యాచ్లకు వేదికలు కానున్నాయి.
త్వరలో షెడ్యూల్పై స్పష్టత..
అయితే, ప్రపంచకప్ ప్రారంభ తేదీపై ఇంకా తుది నిర్ణయం వెల్లడి కాలేదు. ప్రసార హక్కులు, మ్యాచ్ల నిర్వహణ, షెడ్యూల్ తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. అక్టోబర్ 2న మొదలయ్యే ప్రపంచకప్ దాదాపు ఏడు వారాల పాటు సాగనుంది. గాంధీ జయంతి రోజున క్రికెట్ ప్రపంచకప్కు శ్రీకారం చుట్టడం జరిగితే.. మహాత్ముడి జ్ఞాపకాలకు క్రీడా వేదికగా మరో ప్రత్యేక గౌరవం దక్కినట్లవుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్ బస్సులు!
- ●E20 Petrol | ఈ20 పెట్రోల్తోనే మైలేజీ తగ్గదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
- ●Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!
- ●Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!
- ●US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
- ●Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం

Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్ బస్సులు!

E20 Petrol | ఈ20 పెట్రోల్తోనే మైలేజీ తగ్గదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!

Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!



