త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Builders Association of India | నిర్మాణ పనుల్లో నాణ్య‌త ముఖ్యం: బీఏఐ అధ్య‌క్షుడు సీన‌య్య‌

Builders Association of India | నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త‌తో పాటు స‌మ‌యానికి పూర్తి చేయడం అత్యంత ముఖ్య‌మ‌ని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు బి.సీన‌య్య (B. Seenaiah) అన్నారు. సభ్యులకు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు.

S

News | Published On Apr 9, 2026, 6.07 pm IST

Builders Association of India | నిర్మాణ పనుల్లో నాణ్య‌త ముఖ్యం: బీఏఐ అధ్య‌క్షుడు సీన‌య్య‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త‌తో పాటు స‌మ‌యానికి పూర్తి చేయడం అత్యంత ముఖ్య‌మ‌ని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు బి.సీన‌య్య (B. Seenaiah) అన్నారు. గురువారం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో రాష్ట్ర, సెంటర్ చైర్మన్ల నియామ‌క‌ కార్యక్రమం (Appointment program) సంద‌ర్భంగా ఆయ‌న ముఖ్య అతిథిగా ప్ర‌సంగించారు. సభ్యులకు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు.

 

ఇన్‌స్టలేషన్ అధికారిగా హాజ‌రైన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వి.సత్య మూర్తి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా వి.రవీందర్ రెడ్డి, 20 మంది సెంటర్ చైర్మన్లను నియ‌మించారు. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కాగా ఈవెంట్ చైర్మన్‌గా వి.సుధాకర్, కో-చైర్మన్‌గా ఎస్.శ్రీనివాస్ రావు వ్యవహరించారు.

కార్యక్రమంలో ఆల్ ఇండియా మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్లు ఎన్.సచితానంద రెడ్డి, డి.వి.ఎన్. రెడ్డి, రాష్ట్ర మాజీ చైర్మన్లు యు.సురేందర్, కె.దేవేందర్ రెడ్డి, వి.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement