త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Shankaranna | బ‌డుగుల హ‌క్కుల ప్ర‌దాత పూలే: ఎమ్మెల్యే శంక‌రన్న‌

MLA Shankaranna | మ‌హాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Pule) బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడార‌ని, ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఓబీసీ చైర్మన్, షాద్‌న‌గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న (MLA Shankaranna) పిలుపునిచ్చారు. పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు.

S

News | Published On Apr 11, 2026, 3.12 pm IST

MLA Shankaranna | బ‌డుగుల హ‌క్కుల ప్ర‌దాత పూలే: ఎమ్మెల్యే శంక‌రన్న‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Pule) బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడార‌ని, ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఓబీసీ చైర్మన్, షాద్‌న‌గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న (MLA Shankaranna) పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ మహాత్మా జ్యోతి బాపూలే 199 వ జయంతి వేడుకల(Birth Anniversary)కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘసంస్కర్త అని, సమాజంలో కుల వివక్షలు, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహ‌నీయుడు అని కొనియాడారు. వెనకబడిన బడుగు, బలహీన వర్గాల హ‌క్కుల ప్ర‌దాత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్నతో పాటు ఓబీసీ రాష్ట్ర కన్వీనర్లు డాక్టర్ కేతూరి వెంకటేష్, డాక్టర్ జూలూరు ధనలక్ష్మి, ఓబీసీ రాష్ట్ర నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement