త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indigo | ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకం.. ఆన్‌లైన్‌లో వివాహ రిసిప్ష‌న్‌

Indigo |ఇండిగో (Indigo) విమానాల ర‌ద్దుతో నూత‌న వ‌ధూవ‌రులు త‌మ వివాహ రిసిప్ష‌న్ (Wedding Reception) కు తామే ఆన్‌లైన్‌లో హాజ‌ర‌య్యారు. అతిథుల ద‌గ్గ‌ర నుంచి వ‌ర్చువ‌ల్ (Virtual) గా ఆశీస్సులు స్వీక‌రించారు.

A

News | Published On Dec 5, 2025, 10.45 am IST

Indigo | ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకం.. ఆన్‌లైన్‌లో వివాహ రిసిప్ష‌న్‌
Advertisement

Indigo | ఇండిగో (Indigo) విమానాల ర‌ద్దుతో ఇటీవ‌ల వివాహం చేసుకున్న ఓ జంట విచిత్ర‌మైన ప‌రిస్థ‌తి ఎదుర్కొంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆన్‌లైన్‌లోనే వివాహ రిసిప్ష‌న్ (Online Reception) కార్య‌క్ర‌మాన్ని పూర్తిచేసుకున్నారు. వేడుక‌ల‌కు హాజ‌రైన అతిథులు వ‌ర్చువ‌ల్‌ (Virtual) గా స్క్రీన్‌పై నూత‌న జంట‌ను చూసి ఆశీర్వ‌దించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

చుక్క‌ల‌నంటుతున్న విమాన టికెట్ల ధ‌ర‌లు

ఒక‌వైపు దేశ‌వ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ గ‌త నాలుగు రోజులుగా దేశ‌వ్యాప్తంగా వంద‌ల సంఖ్య‌లో విమానాల‌ను ర‌ద్దు చేసింది. ఈ విమానాల ర‌ద్దు శుక్ర‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఇప్ప‌టికే కంపెనీ స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఇండిగో విమానాల ర‌ద్దుతో ఇత‌ర విమానాల టికెట్ల ధ‌ర‌లు చుక్క‌ల‌ను తాకుతుండ‌డంతో పాటు టికెట్లు సైతం అందుబాటులోకి లేకుండా పోయాయి.

భువ‌నేశ్వ‌ర్‌లో వివాహం... హుబ్లీలో విందు

ఒడిషాలోని భువ‌నేశ్వ‌ర్‌ (Bhuvaneshwar)కు చెందిన సంగ‌మ‌దాస్‌, క‌ర్ణాట‌క‌లోని హుబ్లీ (Hubli)కి చెందిన మేధాక్షీర్ సాగ‌ర్ ఇద్ద‌రూ బెంగుళూర్‌ (Bengaluru) లో సాఫ్ట్‌వేర్ (Software) ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి వివాహం గ‌త నెల 23న భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రిగింది. ఈ నెల 4న హుబ్లీలో వివాహ రిసిప్ష‌న్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం 2న భువ‌నేశ్వ‌ర్ నుంచి బెంగుళూర్ మీదుగా హుబ్లీకి వెళ్లేందుకు ఇండిగో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండో తేదీ ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు విమానాశ్ర‌యానికి చేరుకున్న నూత‌న వ‌ధూవ‌రులు విమానం కోసం బుధ‌వారం వ‌ర‌కు వేచి చూశారు. చివ‌రికి విమానం ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారుల ప్ర‌క‌టించారు. దాంతో పాటు భువ‌నేశ్వ‌ర్ నుంచి ముంబై మీదుగా హుబ్లీకి వెళ్లే వారి బంధువుల విమానాలు సైతం ర‌ద్ద‌య్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది.

క్రియేటివ్ ఐడియా.. ఆన్‌లైన్ రిసిప్ష‌న్‌

విమానాల ర‌ద్దుతో భువ‌నేశ్వ‌ర్‌లో చిక్కుకుపోయిన వ‌ధూవ‌రులు నిరాశ చెంద‌కుండా ఆన్‌లైన్‌లో రిసిప్ష‌న్ చేసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే బంధువులు, స‌న్నిహితుల‌కు రిసిప్ష‌న్ కోసం హుబ్లీకి చేరుకోవ‌డంతో య‌ధాత‌థంగా వేడుక‌ను నిర్వ‌హించారు. వ‌ధూవ‌రులు ముస్తాబై కూర్చుని, వ‌ర్చువ‌ల్‌గా వేడుక జ‌రిగే వేదిక‌పై స్క్రీన్‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు. అతిథుల నుంచి వ‌ర్చువ‌ల్‌ (Virtual)గానే ఆశీస్సులు స్వీక‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement