ATA | ముఖ్యమంత్రి గారూ..ఆటా మహాసభలకు రండి
అమెరికాలోని మేరీలాండ్ లో జరగనున్న ఆటా మహా సభలకు హాజరు కావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు.
ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు
-
ముఖ్యమంత్రి గారూ..ఆటా మహాసభలకు రండి
-
ఆహ్వానం పలికి ఆటా మహాసభల ప్రతినిధులు
-
ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు
-
19వ ఆటా సభలు
త్రినేత్ర.న్యూస్ : అమెరికాలోని మేరీలాండ్ లో జరగనున్న ఆటా మహా సభలకు హాజరు కావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు
బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో
అమెరికాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆటా పేరు ప్రఖ్యాతులు గాంచిన విషయం తెలిసిందే. తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారిత, వ్యాపార నెట్ వర్కింగ్ వంటి అంశాల్లో అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ మానవతా సేవను ఆటా నిరంతరం ప్రోత్సహిస్తున్నది. కాగా ఈ 19వ ఆటా సభలు ఈ సారి మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్ లో జరగనున్నాయి. 4,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ స్పేస్ లో అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లు ఉన్నాయి.
ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు
ఆటా మహా సభలకు దాదాపు 10 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ ఏడాది జూలై 31 నుంచి జరగబోయే 19వ మహాసభలకు గత ఏడాది అక్టోబర్ లోనే సన్నాహక సమావేశాలు జరిగాయి. కిక్ ఆఫ్ ఈవెంట్ పేరుతో జరిగిన ఈ సన్నాహక సమావేశాలకు తెలుగు వారైన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాదు 1.4 మిలియన్ డాలర్ల నిధులను కూడా సేకరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



