త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NRI BRS UK President Naveen Reddy | పిరికిపంద చర్య.. కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ యూకే

మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ దాడులకు బీఆర్ఎస్ భయపడదని ఆయన స్పష్టం చేశారు.

J

Medak | Published On Apr 4, 2026, 7.57 pm IST

NRI BRS UK President Naveen Reddy | పిరికిపంద చర్య.. కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ యూకే
Advertisement

NRI BRS UK President Naveen Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే (NRI BRS UK) శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ దాడి కాంగ్రెస్ గూండాల పనేనని, ఇదొక పిరికిపంద చర్య అని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దాడులకు, నిర్బంధాలకు బీఆర్ఎస్ బెదరదు

కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అదరదని, బెదరదని నవీన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని, కేసీఆర్ కార్యాలయంపై ఇలా దాడులకు తెగబడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గదని, తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని నవీన్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజల పక్షాన తమ గొంతుకను మరింత బలంగా వినిపిస్తామన్నారు. భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి

మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను పోలీసులు వెంటనే గుర్తించాలని నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నించే వారిపై ఇలా దౌర్జన్యాలకు దిగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement