త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meals | భోజనం చేసిన వెంటనే కూర్చుంటే ప్రమాదమే.. నిపుణుల హెచ్చరిక..

Meals | భోజ‌నం చేసిన త‌రువాత స‌హ‌జంగానే చాలా మందికి నిద్ర మ‌త్తు వ‌స్తుంది. ఎందుకంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మొత్తం జీర్ణ‌వ్య‌వస్థ వైపు కేంద్రీకృత‌మ‌వుతుంది. ఈ కార‌ణంగా ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గుతుంది. దీంతో మెద‌డుకు నిద్రావ‌స్థ సంకేతం వెళ్తుంది.

S

Lifestyle | Published On Feb 8, 2026, 9.48 am IST

Meals | భోజనం చేసిన వెంటనే కూర్చుంటే ప్రమాదమే.. నిపుణుల హెచ్చరిక..
Advertisement

Meals | భోజ‌నం చేసిన త‌రువాత స‌హ‌జంగానే చాలా మందికి నిద్ర మ‌త్తు వ‌స్తుంది. ఎందుకంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మొత్తం జీర్ణ‌వ్య‌వస్థ వైపు కేంద్రీకృత‌మ‌వుతుంది. ఈ కార‌ణంగా ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గుతుంది. దీంతో మెద‌డుకు నిద్రావ‌స్థ సంకేతం వెళ్తుంది. దీని కార‌ణంగా భోజ‌నం చేసిన వెంట‌నే చాలా మందికి నిద్ర మ‌త్తు వ‌స్తుంది. దీంతో మ‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే చాలా మంది నిద్రిస్తుంటారు. ఇక భోజ‌నం చేశాక చాలా మంది కూర్చుని ప‌నిచేస్తుంటారు కూడా. కానీ భోజనం చేసిన త‌రువాత నిజానికి ఈ రెండు అల‌వాట్లు అస‌లు మంచివి కావ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ అల‌వాట్ల వ‌ల్ల దీర్ఘ‌కాలంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

బ‌రువు, షుగ‌ర్ పెరుగుద‌ల‌..

భోజ‌నం చేసిన వెంట‌నే కూర్చోవ‌డం లేదా నిద్రించ‌డం చేస్తే దీర్ఘ‌కాలంలో బ‌రువు పెర‌గ‌డంతోపాటు ర‌క్తంలో చక్కెర స్థాయిలు సైతం పెరుగుతాయని న్యూజెర్సీకి చెందిన ఎండోక్రైనాలజిస్టు డాక్ట‌ర్ అలేషియా రోనెల్ట్ చెప్పారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని వివరించారు. భోజ‌నం చేసిన వెంట‌నే కూర్చోవ‌డం, నిద్రించ‌డం చేయ‌కుండా కాసేపు వాకింగ్ చేయాల‌ని ఆమె సూచించారు. దీని వ‌ల్ల అనేక లాభాలు ఉంటాయ‌ని తెలిపారు. భోజ‌నం చేశాక కాసేపు వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియకు మేలు జ‌రుగుతుంది. ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. పేగుల్లో క‌ద‌లిక‌లు చురుగ్గా ఉంటాయి. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంద‌ని అన్నారు.

వాకింగ్ ఉత్త‌మం..

భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయ‌ని అలేషియా చెప్పారు. దీని వ‌ల్ల దీర్ఘ‌కాలంలో డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని అన్నారు. ఇప్ప‌టికే మ‌ధుమేహం ఉన్న‌వారికి అయితే చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని అన్నారు. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కండ‌రాలకు ప‌ని ల‌భిస్తుంది. దీంతో అవి ర‌క్తంలో ఉన్న గ్లూకోజ్‌పై ఆధార ప‌డ‌తాయి. ఫ‌లితంగా ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వాకింగ్ ఉత్త‌మ మెడిసిన్ అని తెలిపారు. అయితే భోజ‌నం చేశాక వాకింగ్ చేయ‌కుండా కూర్చోవ‌డం లేదా నిద్రించ‌డం చేస్తే శ‌రీరం ఇన్సులిన్‌పై అధికంగా ఆధార ప‌డాల్సి ఉంటుంది. కానీ డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ నియంత్ర‌ణ క‌ష్టంగా ఉంటుంది. దీంతో మ‌రింత ఇబ్బంది క‌లుగుతుంది. క‌నుక భోజనం చేశాక కాసేపు వాకింగ్ ఒక్క‌టే దీనికి ప‌రిష్కారం అని ఆమె తెలిపారు.

భోజ‌నం చేశాక 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయ‌డం వల్ల బ‌రువు త‌గ్గ‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ఆమె చెప్పారు. దీని వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌పై ఆధార ప‌డ‌డం త‌గ్గుతుంది. కండ‌రాలు, కొవ్వు క‌ణ‌జాలం వినియోగించుకోబ‌డ‌తాయి. ఈ కార‌ణంగా శ‌రీరంలోని కొవ్వు నిల్వ‌లు క‌రుగుతాయి. బ‌రువును త‌గ్గించుకోవ‌డం తేలిక‌వుతుంది. క‌నుక భోజ‌నం అనంత‌రం వాకింగ్ బెస్ట్ అని ఆమె సూచించారు.

Advertisement
Advertisement