Dr Vikrant Singh Thakur | నా గుండెను 20 నిమిషాలు ఆపేశారు
20 నిమిషాల పాటు గుండె ఆగిపోయి, ప్రాణాపాయం నుంచి బయటపడిన కరీంనగర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ స్టోరీ ఇది. పేషెంట్ల కోసం ఆయన పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.
Karimnagar | Published On Jun 28, 2026, 11.00 pm IST
- చావును గెలిచి.. ప్రజల కోసమే బతుకుతూ
- 20 నిమిషాలు గుండె ఆగిపోయినా ప్రాణాలతో తిరిగొచ్చిన 'కరీంనగర్' డాక్టర్
- అరుదైన 'అయోర్టిక్ అన్యూరిజం' వ్యాధితో 20 నిమిషాల పాటు ఆగిన గుండె
- అయినా ప్రాణాలతో బయటపడిన ప్రముఖ కరీంనగర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్
- తన పునర్జన్మ తర్వాత సమాజాన్నే తన కుటుంబంగా భావిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం తెస్తున్న వైద్యుడు
- పిల్లలకు జంక్ ఫుడ్, ప్యాకెట్ నూనెలు వాడొద్దని, గానుగ నూనె (Cold-pressed oil) తోనే ఆరోగ్యం అని ఆయన ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్
- కరీంనగర్లోని 'టైమ్ న్యూరోకేర్'లో కేవలం రూ.400 ఫీజుతోనే సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు
Dr Vikrant Singh Thakur | త్రినేత్ర.న్యూస్ : చావు అంచుల దాక వెళ్లి వస్తే మనిషిలో ఊహించని మార్పు వస్తుంది. కరీంనగర్ (Karimnagar) కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ (Dr Vikrant Singh Thakur) ప్రయాణం కూడా అలాంటిదే. జూలై 27, 2025న తన ఓపీలో (OP) పేషెంట్లను చూస్తున్న సమయంలో ఆయనకు సడన్గా తాను చనిపోబోతున్నాననే భావన మెదడును తొలిచేసింది. వెంటనే టెస్ట్ చేయించుకోగా, పుట్టుకతో వచ్చే అరుదైన 'అయోర్టిక్ అన్యూరిజం' (Aortic aneurysm) వ్యాధి ఉందని తేలింది. అది 5 సెంటీమీటర్లు విస్తరించి ఉందని, ఎప్పుడైనా ప్రాణాలు పోయే (Spot death) ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారించారు.
20 నిమిషాలు ఆగిన గుండె.. పునర్జన్మ
సరిగ్గా 15 రోజుల తర్వాత యశోద హైటెక్ సిటీలో డాక్టర్ విక్రమ్ రెడ్డి నేతృత్వంలో ఆయనకు ఒక మేజర్ సర్జరీ జరిగింది. కేవలం 50-50 శాతం మాత్రమే బతికే చాన్స్ ఉన్న ఆ ఆపరేషన్లో భాగంగా ఏకంగా 20 నిమిషాల పాటు ఆయన గుండెను ఆపేశారు. ఆ 20 నిమిషాల్లో పాత విక్రాంత్ చనిపోయాడని, ఆ తర్వాత దేవుడే తనలోకి వచ్చాడని ఆయన ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు తాను పలికే ప్రతి మాట, చేసే ప్రతి పని దేవుడి దయ వల్లే జరుగుతున్నాయని ఆయన గాఢంగా విశ్వసిస్తున్నారు.
జంక్ ఫుడ్ పెడుతున్నారని కన్నీటి పర్యంతం
చావును జయించిన తర్వాత సమాజాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తున్న డాక్టర్ విక్రాంత్, ప్రజల అనారోగ్యపు అలవాట్లను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఆసుపత్రిలో అపాయింట్మెంట్ దొరక్క జనాలు గొడవ పడుతున్న సమయంలో.. అక్కడే ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చి, జంక్ ఫుడ్ పెడుతుండటం చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చాక్లెట్లు, చిప్స్, బిస్కెట్లు పిల్లలకు విషంలాంటివని ఆయన హెచ్చరిస్తున్నారు.
యువకులకు, నలభై ఏళ్ల వారికి పక్షవాతం (Paralysis) వచ్చి కుటుంబాలు రోడ్డున పడుతుంటే చూడలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకెట్ నూనెలు మానేసి.. గానుగ నూనె (Cold-pressed oil) వాడాలని, మంచి పౌష్టికాహారం రోజుకు రెండు పూటలు తీసుకుంటే చాలని ఆయన ప్రాధేయపడుతున్నారు. తాను చెప్పే ఈ మాటలు విని ఒక్క కుటుంబం మారినా తన జన్మ ధన్యమేనని ఆయన అంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



