త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?

బ్రిక్స్ తొలి రోజు ప్రధాని మోదీ ఇచ్చిన గ్రాండ్ డిన్నర్‌కు జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఆయన ఎందుకు రాలేకపోయారో దౌత్య వర్గాలు స్పష్టతనిచ్చాయి.

J

International | Published On Sep 13, 2026, 1.22 pm IST

Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?

సంక్షిప్త సారాంశం

బ్రిక్స్ సదస్సు తొలి రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అధికారిక విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ గైర్హాజరయ్యారు. సుదీర్ఘ విమాన ప్రయాణం, సమయ వ్యత్యాసం (టైమ్ జోన్ తేడా) వల్ల తీవ్ర అలసట చెందడమే జిన్‌పింగ్ రాకపోవడానికి ప్రధాన కారణమని సమాచారం. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర గౌరవం, విభేదాలు వివాదాలుగా మారకూడదనే అంశాలపై కీలక ఏకాభిప్రాయం కుదిరింది.

Advertisement
  • మోదీ విందుకు చైనా అధ్యక్షుడు దూరం
  • అసలు కారణం ఇదేనా?

Xi Jinping Skips Modi Dinner | త్రినేత్ర.న్యూస్ : న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు తొలి రోజు ముగిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాలేదు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుని, సదస్సుతో పాటు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న జిన్‌పింగ్.. రాత్రి జరిగిన గ్రాండ్ డిన్నర్‌కు రాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే దీని వెనుక ఎలాంటి దౌత్యపరమైన విభేదాలు లేవని, కేవలం శారీరక అలసటే కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి.

సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఢిల్లీకి చేరుకోవడం, దేశాల మధ్య ఉండే టైమ్ జోన్ తేడా (జెట్ లాగ్) కారణంగా జిన్‌పింగ్ తీవ్ర అలసటకు గురయ్యారని సమాచారం. వరుస సమావేశాలతో రోజు మొత్తం బిజీ షెడ్యూల్ ఉండటంతో విశ్రాంతి కోసమే ఆయన విందుకు దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కూడా ఈ డిన్నర్‌కు హాజరుకాలేదు.

Why Xi Jinping Skipped PM Modi's BRICS Dinner in Delhi

పుతిన్, కేంద్ర మంత్రులు, సీఎంల సందడి

జిన్‌పింగ్ దూరంగా ఉన్నప్పటికీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు ఈ విందుకు విచ్చేశారు. వారితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత బిశ్వ శర్మ తదితరులు పార్లమెంట్ హౌస్ నుంచి ప్రత్యేక బస్సుల్లో భారత్ మండపం చేరుకుని విందులో పాల్గొన్నారు.

మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు సఫలం

విందుకు దూరమైనప్పటికీ, అంతకుముందు మోదీ-జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో, దౌత్య సంబంధాల్లో వచ్చే భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, ఉమ్మడి ప్రయోజనాలు అనే మూడు సూత్రాల ఆధారంగా భారత్-చైనా బంధం ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించగా, దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

Advertisement
Advertisement