త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz Tolls | ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.. టోల్ వసూలుకు ఓమన్ సహకరిస్తే పేల్చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్

హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ ప్లాన్‌పై అమెరికా ఫైర్ అయింది. ఓమన్ సహకరిస్తే బాంబులతో పేల్చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

J

International | Published On May 28, 2026, 10.30 pm IST

Strait of Hormuz Tolls | ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.. టోల్ వసూలుకు ఓమన్ సహకరిస్తే పేల్చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్
Advertisement

Strait of Hormuz Tolls | త్రినేత్ర.న్యూస్ : గల్ఫ్ దేశాల్లో (Gulf countries) మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త సైలెంట్‌గా ఉన్న వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకల నుంచి 'టోల్' (Toll) వసూలు చేయాలని చూస్తున్న ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా నిప్పులు చెరిగింది. ఇరాన్ నాటకాలకు ఒకవేళ ఓమన్ (Oman) గనుక సహకరిస్తే.. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని, అవసరమైతే బాంబులతో పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

సహకరిస్తే ఆంక్షలు తప్పవు: స్కాట్ బెస్సెంట్

హార్ముజ్ జలసంధిలో టోల్ సిస్టమ్ తీసుకురావాలన్న ఇరాన్ ఎత్తుగడలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ (US Treasury Secretary) స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. దీనికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరించే వ్యక్తులు, కంపెనీలు, చివరకు దేశాలపైనా కఠిన ఆంక్షలు (Sanctions) విధిస్తామని ఎక్స్ (X) వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. వాషింగ్టన్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఓమన్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. "ఈ ప్రాంతంలో ఇరాన్ టెర్రరిజం (Terrorizing) చేసే రోజులు ముగిశాయి.. స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తే ఏ దేశమైనా మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఆయన తేల్చిచెప్పారు.

ఓమన్‌ను పేల్చేస్తాం: ట్రంప్ సంచలనం

క్యాబినెట్ మీటింగ్‌లో (Cabinet meeting) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇష్యూపై మరింత అగ్రెసివ్‌గా స్పందించారు. హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ ట్రాఫిక్‌ను ఇరాన్, ఓమన్ దేశాలు సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయంటూ ఇరాన్ స్టేట్ టీవీలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. "అది అంతర్జాతీయ జలాశయం (International waters).. దానిపై ఎవరికీ కంట్రోల్ ఉండదు. అమెరికా దానిని పర్యవేక్షిస్తుంది. అందరిలాగే ఓమన్ కూడా బుద్ధిగా వ్యవహరించాలి.. లేదంటే వాళ్లను పేల్చేయాల్సి వస్తుంది (Blow them up)" అని ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇరాన్ టీవీ రిపోర్ట్ అంతా అబద్ధపు సృష్టి అని వైట్ హౌస్ (White House) కూడా కొట్టిపారేసింది. వాస్తవానికి అమెరికా-ఇరాన్ మధ్య గొడవలకు ఓమన్ చాలాకాలంగా మధ్యవర్తిత్వం వహిస్తోంది. అలాంటి దేశంపై ట్రంప్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

తగ్గని మిలిటరీ టెన్షన్.. కువైట్‌పై దాడి

డిప్లమాటిక్ వార్ (Diplomatic dispute) ఇలా ఉంటే.. గల్ఫ్‌లో మిలిటరీ టెన్షన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ (Bandar Abbas) సమీపంలో అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్ (Drone launch site) లక్ష్యంగా తాము ఈ స్ట్రైక్స్ చేసినట్లు వాషింగ్టన్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై గురువారం నాడు ఇరాన్ దాడులకు తెగబడింది. ఐదు ఇరాన్ ఎటాక్ డ్రోన్లను అమెరికా బలగాలు అడ్డుకున్నాయని సెంట్రల్ కమాండ్ (US Central Command) తెలిపింది. కువైట్ వైపు దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని (Ballistic missile) కూడా ఇంటర్‌సెప్ట్ చేశారు. ఈ దాడుల బాధ్యతను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తీసుకుంది. అమెరికా మరోసారి దాడులకు పాల్పడితే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ మీడియా హెచ్చరించింది. దీర్ఘకాలిక శాంతి కోసం జరుగుతున్న చర్చలకు ఈ పరిణామాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement