త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mine Collapse | కుప్ప‌కూలిన గ‌ని.. 200 మందికి పైగా మృతి

Mine Collapse | ఆఫ్రికా దేశమైన‌ కాంగోలో (Congo) పెను విషాదం చోటుచేసుకున్న‌ది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి (Mine Collapse) రుబయా కోల్టన్‌ గని కుప్పకూలింది. దీంతో 200 మందికిపైగా మరణించారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

G

International | Published On Mar 5, 2026, 8.04 am IST

Mine Collapse | కుప్ప‌కూలిన గ‌ని.. 200 మందికి పైగా మృతి
Advertisement

Mine Collapse | త్రినేత్ర‌.న్యూస్‌: ఆఫ్రికా దేశమైన‌ కాంగోలో (Congo) పెను విషాదం చోటుచేసుకున్న‌ది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి (Mine Collapse) రుబయా కోల్టన్‌ గని కుప్పకూలింది. దీంతో 200 మందికిపైగా మరణించారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గని ఎం23 రెబల్‌ గ్రూప్ ఆధీనంలో ఉంది. అయితే, బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం ఐదుగురు మాత్రమే చనిపోయినట్లు తిరుగుబాటుదారులు ప్రకటించింది.

నార్త్ కివూ ప్రావిన్స్ రాజ‌ధాని గొమాకు 70 కిలోమీట‌ర్ల దూరంలో రుబ‌యా కోల్ట‌న్ గ‌నులు ఉన్నాయి. ఈ ప్రాంతం 2024 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న‌ది. `మృతుల సంఖ్య‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా అబ‌ద్ధం. అక్క‌డ ఎలాంటి కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌లేదు. బాంబులు పేల‌డంతో ఐదుగురు మాత్ర‌మే మ‌ర‌ణించారు. వారిలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు` అని రెబ‌ల్ గ్రూప్ సీనియ‌ర్ అధికారి ఫాన్నీ కాజ్ తెలిపారు.

కాగా, గ‌నిలో ప‌నిచేస్తున్న ఇబ్ర‌హిం అనే వ్య‌క్తి మాత్రం 200కు పైగా మృత‌దేహాల‌ను వెలికి తీశార‌ని చెప్పారు. తమ ప్ర‌ణాల‌కు ముప్పు పొంచి ఉన్న‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మైన్ నిర్వాహ‌కులు మృతుల సంఖ్య‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు.

Advertisement
Advertisement