త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హ‌స్తినాపురంలో ఉద్రిక్త‌త‌.. రోడ్డుపై బైఠాయించిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

Hyderabad | హైద‌రాబాద్ (Hyderabad) బీఎన్ రెడ్డి పరిధిలోని హ‌స్తినాపురంలో ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. బుధ‌వారం ఉద‌యం హ‌స్తినాపురం (Hasthinapuram) వ‌ద్ద సాగ‌ర్ రోడ్డుపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు స‌హా మ‌రొక‌రు మ‌ర‌ణించారు.

G

Hyderabad | Published On Apr 8, 2026, 9.20 am IST

Hyderabad | హ‌స్తినాపురంలో ఉద్రిక్త‌త‌.. రోడ్డుపై బైఠాయించిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad) బీఎన్ రెడ్డి పరిధిలోని హ‌స్తినాపురంలో ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. బుధ‌వారం ఉద‌యం హ‌స్తినాపురం (Hasthinapuram) వ‌ద్ద సాగ‌ర్ రోడ్డుపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు స‌హా మ‌రొక‌రు మ‌ర‌ణించారు. దీంతో వారి కాలేజీకి చెందిన విద్యార్థులు రోడ్డు బైఠాయించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డ్రైవ‌ర్‌ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ ఆందోళ‌న‌కు దిగారు.

బుధ‌వారం ఉద‌యం బైకు, న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ యువ‌కుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న మ‌హ‌వీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఈసీఈ విద్యార్థులు శివ‌, సందీప్‌.. రోడ్డుపై న‌డిచి వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. అదేస‌మ‌యంలో కాలేజీకి వెళ్తున్న తోటి విద్యార్థులు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కారు డ్రైవ‌ర్‌ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో విద్యార్థులు శాంతించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement