త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్ర‌మాదం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం

Building collapsed in Gachibowli | హైదరాబాద్ న‌గరంలోని గచ్చిబౌలిలో పెను విషాదం చోటుచేసుకుంది. అంజయ్యనగర్‌లోని నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మ‌ధ్యాహ్నం ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

S

Hyderabad | Published On Aug 22, 2026, 4.22 pm IST

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్ర‌మాదం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం
Advertisement
  • మ‌ధ్య‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కార్మికుల మృతి
  • భ‌యంతో ప‌క్క‌నే ఉన్న హాస్ట‌ల్ విద్యార్థుల ప‌రుగు

Building collapsed in Gachibowli | త్రినేత్ర‌.న్యూస్: హైదరాబాద్ న‌గరంలోని గచ్చిబౌలిలో పెను విషాదం చోటుచేసుకుంది. అంజయ్యనగర్‌లోని నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మ‌ధ్యాహ్నం ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్‌ కార్మికులు ఉమేశ్‌ కారే (34), మోపత్‌ (42) ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శ్ర‌మించి బ‌య‌ట‌కు తీశారు. ఈ భవనం ఒక్కసారిగా కూలిపోవ‌డంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. అంజ‌య్య‌న‌గ‌ర్‌లో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏడంత‌స్తుల‌ భవనం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూలిపోయింది. పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై ఆ భ‌వ‌నం శిథిలాలు ప‌డడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న‌ ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. అపార్ట్‌మెంట్‌ గోడలు సైతం ధ్వంస‌మ‌య్యాయి. దీంతో అందులో నివ‌సిస్తున్న‌వారు బయటకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న ఓ హాస్టల్‌ విద్యార్థులు సైతం భయంతో బయటకు పరుగులు పెట్టారు.

ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్నారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటారేమోన‌ని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. ఇదే ప్ర‌మాదం సాయంత్రం సమయంలో జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువ‌గా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ కమిషనర్‌ సృజన ఘ‌ట‌నా స్థ‌లాన్ని పరిశీలించి సూచ‌న‌లు చేశారు.

బిల్డర్‌ కోసం పోలీసుల వేట‌..

మ‌రోవైపు సరైన ప్రమాణాలు లేకుండా తక్కువ స‌మ‌యంలో భ‌వ‌నం నిర్మించడంతో పేకమేడలా కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనం నిర్మాణం చేస్తున్న బిల్డర్‌ సాజిద్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా భ‌వ‌న నిర్మాణం జ‌రిగిందా? లేదా? స‌రైన నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించారో లేదో అనే విష‌యాలపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Advertisement
Advertisement