త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | సొంతింట్లో బంగారు దొంగ‌త‌నం.. కుమారుడితో స‌హా ముగ్గురు అరెస్ట్

Hyderabad | జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డ ఓ యువ‌కుడు సొంతింట్లోనే బంగారం దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసులో కుమారుడితో స‌హా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Apr 3, 2026, 7.09 pm IST

Hyderabad | సొంతింట్లో బంగారు దొంగ‌త‌నం.. కుమారుడితో స‌హా ముగ్గురు అరెస్ట్
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డ ఓ యువ‌కుడు సొంతింట్లోనే బంగారం దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసులో కుమారుడితో స‌హా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కంచ‌న్‌బాగ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హ‌ఫీజ్‌బాబా న‌గ‌ర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ ర‌హ్మ‌త్ ష‌రీఫ్‌(56) త‌న భార్యాపిల్ల‌ల‌తో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే మార్చి 29వ తేదీన బీరువాను చూడగా, అందులో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాలు మాయ‌మ‌య్యాయి. దీంతో ష‌రీఫ్ కంచ‌న్‌బాగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ష‌రీఫ్ కుమారుడు మ‌హ్మ‌ద్ అద్నాన్ ష‌రీఫ్‌(19) ప్ర‌వ‌ర్త‌న‌పై పోలీసుల‌కు అనుమానం క‌లిగింది. అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 17 నుంచి మార్చి 29 వ‌ర‌కు బంగారు ఆభ‌ర‌ణాల‌ను విడ‌త‌ల వారీగా దొంగిలించిన‌ట్లు ఒప్పుకున్నాడు. ఈ బంగారాన్ని త‌న స్నేహితులైన మ‌రో ఇద్ద‌రికి అప్ప‌గించి విక్ర‌యించాల‌ని కోరాన‌ని పేర్కొన్నాడు.

ఈ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అద్నాన్ ష‌రీఫ్‌తో పాటు స్నేహితులు మ‌హ్మ‌ద్ రెహాన్ ఉద్దీన్‌(25), మ‌హ్మ‌ద్ స‌మీర్‌(22)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజ‌రుప‌రిచి జ్యుడిషీయ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement
Advertisement