త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు.. అంబ‌ర్‌పేట‌లో ముగ్గురు మృతి

Hyderabad | వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు భ‌రించ‌లేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట్‌లో చోటు చేసుకుంది.

S

Hyderabad | Published On Feb 24, 2026, 3.37 pm IST

Hyderabad | వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు.. అంబ‌ర్‌పేట‌లో ముగ్గురు మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు భ‌రించ‌లేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట్‌లో చోటు చేసుకుంది. మృతుల‌ను రామ‌రాజు(55), ఆయ‌న భార్య మాధ‌వి(50), కుమారుడు శశాంక్‌(24)గా పోలీసులు గుర్తించారు.

అంబ‌ర్‌పేట్‌లో నివాస‌ముంటున్న రామ‌రాజు.. ల్యాండ్ మార్క్ హోట‌ల్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే హోట‌ల్ వ్యాపారంలో భారీగా న‌ష్టాలు చవిచూశాడు. అప్పులు కూడా ఎక్కువ‌య్యాయి. చివ‌ర‌కు వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు భ‌రించ‌లేక రామ‌రాజు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తేల్చారు.

హ‌త్య‌.. ఆపై ఆత్మ‌హ‌త్య‌

  • మొద‌ట మాధ‌విని చంపాల‌ని రామ‌రాజు నిర్ణ‌యించుకున్నాడు. దీంతో కుమారుడి స‌హ‌కారంతో ఆమెపై దిందు పెట్టి ఊపిరాడ‌కుండా చేసి చంపేశారు. అనంత‌రం తండ్రీకుమారుడు సూసైడ్ చేసుకున్నారు. రామ‌రాజు ఉరేసుకోగా, శశాంక్ మ‌ణిక‌ట్టు క‌ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

వెలుగులోకి ఇలా..

  • మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న‌కు ముందు.. రామ‌రాజు త‌న స్నేహితుడు ర‌వికి మొబైల్‌లో సందేశం పంపాడు. తాము ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నామ‌ని తెల్ల‌వారుజామున 3.15 గంట‌ల‌కు మేసేజ్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ర‌వి.. రామ‌రాజు నివాసానికి వ‌చ్చి చూడగా ముగ్గురు చ‌నిపోయి ఉన్నారు. వెంట‌నే 100కి కాల్ చేయ‌గా.. పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాల‌ను సేక‌రించింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు సికింద్రాబాద్ జోన్ అద‌న‌పు డీసీపీ న‌ర్స‌య్య పేర్కొన్నారు.

సూసైడ్ నోట్ ల‌భ్యం..

  • రామ‌రాజు నివాసంలో సూసైడ్ నోట్ ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక భారం కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు రామ‌రాజు సూసైడ్ నోట్‌లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ట్లు తెలిసింది.
Advertisement
Advertisement