త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | గెలిపించాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డావ్‌.. సీఎం రేవంత్‌పై ఎంఏ ముఖీం ఆగ్ర‌హం

G

Hyderabad | Published On Apr 13, 2026, 8.34 am IST

Revanth Reddy | గెలిపించాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డావ్‌.. సీఎం రేవంత్‌పై ఎంఏ ముఖీం ఆగ్ర‌హం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండ‌లం ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కోర్టు స్టే ఆర్డర్​ ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్​ హౌస్​తో పాటు ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూమి స్వాధీనం, గెస్ట్‌హౌజ్‌, అపార్ట్‌మెంట్‌ కూల్చివేతలు, సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్‌ఎస్‌ నేత, న్యాయవాది ఎంఏ ముఖీం (MA Mukheem) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పాత పరిచయంతో రేవంత్ తన ఇంటికి వచ్చాడ‌ని, కాళ్లు పట్టుకుని గెలిపించాలని ప్రాధేయపడిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. `నా ఇంట్లో భోజనం చేసి, నీళ్లు తాగి నాకే ద్రోహం చేస్తావా` అని ధ్వజమెత్తారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం కక్షపూరితంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఇండ్ల‌ జోలికి వెళ్లకుండా, మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిలో క‌ట్ట‌డాలు, ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. శనివారం ఉదయం 6 గంటలకు చేప‌ట్టిన ఈ భారీ ఆప‌రేష‌న్‌లో 300 మంది హైడ్రా, పోలీసులు పాల్గొన్నారు. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement