త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police SOCEYE | సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారా? హైదరాబాద్ పోలీసుల కొత్త ‘ఏఐ’ బ్రహ్మాస్త్రం వచ్చేసింది

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టే వారి భరతం పట్టేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం 'సాక్ ఐ' (SOC-EYE) అనే ఏఐ అప్లికేషన్‌ను ప్రారంభించింది.

J

Hyderabad | Published On May 18, 2026, 9.30 pm IST

Hyderabad Police SOCEYE | సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారా? హైదరాబాద్ పోలీసుల కొత్త ‘ఏఐ’ బ్రహ్మాస్త్రం వచ్చేసింది
Advertisement

Hyderabad Police SOCEYE | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో సిటీ పోలీస్ (City Police) విభాగం మరో సంచలన అడుగు వేసింది. సోషల్ మీడియాలో (Social media) ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో చెలరేగిపోతున్న వారి భరతం పట్టేందుకు 'సాక్ ఐ' (SOC-EYE: Social Media Observation and Cyber Intelligence) పేరిట ఓ అత్యాధునిక కృత్రిమ మేధ (AI) అప్లికేషన్‌ను సిటీ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో అల్లర్లు రేపే శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఈ టూల్ ఉపయోగపడనుంది.

గంటల కొద్దీ వెతికే పనుండదు.. అంతా ఆటోమేటెడ్

ఒకప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను కనుక్కోవడానికి పోలీసులకు గంటల తరబడి సమయం, భారీగా సిబ్బంది అవసరమయ్యేది. కానీ ఈ కొత్త 'సాక్ ఐ' టూల్‌తో అంతా ఆటోమేటెడ్ (Automated) అయిపోయింది. ఇందులో ఉన్న ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ (Intelligent dashboard) ద్వారా డయల్ 100 కాల్స్, ఇంటెలిజెన్స్ సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలన్నీ అధికారులకు ఒకే చోట స్క్రీన్‌పై లైవ్‌లో కనిపిస్తాయి.

తొలి అడుగులోనే సూపర్ సక్సెస్

ఈ టూల్ ప్రయోగాత్మక దశలోనే అదరగొట్టింది. ఇటీవల నగరంలో జరిగిన పురానాపూల్ (Puranapool), గుడిమల్కాపూర్ వివాదాల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వందలాది విద్వేషపూరిత పోస్టులను (Hate posts) ఇది ఇట్టే పసిగట్టింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు, సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు రిపోర్ట్ చేసి ఆ కంటెంట్‌ను డిలీట్ చేయించారు. తద్వారా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే కాపాడారు.

మహిళల భద్రత, డ్రగ్స్‌పై స్పెషల్ ఫోకస్

ముఖ్యంగా సైబర్ బుల్లింగ్ (Cyber bullying), మహిళలపై వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడుల కంటెంట్, డ్రగ్స్ సప్లైకి సంబంధించిన పోస్టులను ఈ ఏఐ (AI) మోడల్స్ వెంటనే గుర్తిస్తాయి. పోస్ట్ తీవ్రతను బట్టి హై, మీడియం, లో రిస్క్‌గా విడదీసి, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేస్తున్న నెట్‌వర్క్‌ల (Networks) గుట్టు రట్టు చేస్తాయి. అంతేకాకుండా సామాన్యులు సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ఫిర్యాదులను కూడా యూనిక్ ట్రాకింగ్ నంబర్‌తో ఎండ్-టు-ఎండ్ (End-to-end) మానిటర్ చేసి పరిష్కరిస్తాయి.

సైబర్ నేరాలకు చెక్..

ర్యాలీలు, నిరసనల సమయంలో ఏదైనా ముప్పు పొంచి ఉంటే నిర్ణీత కీవర్డ్స్ (Keywords) ద్వారా ముందుగానే పోలీసులను అలర్ట్ చేస్తుంది. సైబర్ దర్యాప్తులో కీలకంగా మారిన SOCMINT, OSINT లాంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. "నేరగాళ్లు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్న ఈ రోజుల్లో.. మహిళలు, పిల్లల రక్షణ కోసం ఈ ఏఐ టూల్ ఓ విప్లవాత్మక మార్పు తేబోతోంది" అని పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement