త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja Gang | ఓల్డ్ సిటీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. ముగ్గురు ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాలు

Ganja Gang | హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బస్తీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ఓల్డ్ సిటీలోని శాస్త్రిపురంలో గంజాయి గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరి దాడిలో ఓ ముగ్గురు ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

S

Hyderabad | Published On Feb 18, 2026, 3.11 pm IST

Ganja Gang | ఓల్డ్ సిటీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. ముగ్గురు ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాలు
Advertisement

Ganja Gang | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బస్తీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ఓల్డ్ సిటీలోని శాస్త్రిపురంలో గంజాయి గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరి దాడిలో ఓ ముగ్గురు ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి శాస్త్రిపురంలో మ‌హ్మ‌ద్ ఖ‌దీర్, మ‌హ్మ‌ద్ ఖ‌లీల్, మ‌హ్మ‌ద్ అల్తాఫ్ అనే ముగ్గురు ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు త‌మ నివాసాల ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వ‌చ్చిన ఓ ఆరుగురు వ్య‌క్తులు.. ఆక‌స్మాత్తుగా ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఖ‌దీర్ ముఖానికి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యే లోగా దుండ‌గులు పారిపోయారు. ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి పాల్ప‌డ్డ గ్యాంగ్ గంజాయి మ‌త్తులో ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. దాంతో పాటు కార్య‌క‌ర్త‌ల‌పై కొంత ద్వేషం కార‌ణంగా కూడా దాడి చేసి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

అయితే ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల అనంత‌రం.. ఓ కొంత మంది వ్య‌క్తుల‌పై స్థానికులు దాడికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో మూడు బైక్‌లు కూడా ధ్వంస‌మైన‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement