త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్మ‌ద్‌ పాషా ఖాద్రీ క‌న్నుమూత‌

Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అహ్మద్ పాషా ఖాద్రీ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఒవైసీ ద‌వాఖానాలో తుదిశ్వాస విడిచారు.

P

Hyderabad | Published On Feb 3, 2026, 8.57 pm IST

Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్మ‌ద్‌ పాషా ఖాద్రీ క‌న్నుమూత‌
Advertisement

Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అహ్మద్ పాషా ఖాద్రీ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఒవైసీ ద‌వాఖానాలో తుదిశ్వాస విడిచారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 30న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో కంచన్ బాగ్‌లోని ఒవైసీ ఆస్పత్రిలో చేరారు. రెండేళ్లుగా రెండేళ్లుగా మూత్రపిండ వ్యాధులతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్నారు. అహ్మద్ పాషా 2004లో తొలిసారి చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2004, 2009, 2014 ఎన్నికల్లో మూడుసార్లు చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, 2018 లో యాకుత్‌పురా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. ఆయ‌న ఎంఐఎం పార్టీలో కీల‌క నేత‌. ప్ర‌స్తుతం ఎంఐఎం పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. 2008లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న.. ఆ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క‌పాత్ర వ‌హించారు. ఆయ‌న మ‌ర‌ణం ఆ పార్టీకి పెద్ద‌లోటుగా భావిస్తున్నారు. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న మ‌ర‌ణంపై పార్టీ సంతాపం ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement