త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EJHS | నిమ్స్‌లో ‘ఈజేహెచ్ఎస్’ వెల్‌నెస్ సెంట‌ర్ మూసివేత‌

EJHS | పంజాగుట్ట‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ర‌కాల మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ఈజేహెచ్ఎస్ వెల్‌నెస్ సెంట‌ర్‌ను రెండు రోజుల పాటు మూసివేయ‌నున్నారు.

S

Hyderabad | Published On Feb 28, 2026, 3.25 pm IST

EJHS | నిమ్స్‌లో ‘ఈజేహెచ్ఎస్’ వెల్‌నెస్ సెంట‌ర్ మూసివేత‌
Advertisement

EJHS | త్రినేత్ర‌.న్యూస్ : పంజాగుట్ట‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ర‌కాల మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ఈజేహెచ్ఎస్ వెల్‌నెస్ సెంట‌ర్‌ను రెండు రోజుల పాటు మూసివేయ‌నున్నారు. ఈ మేర‌కు నిమ్స్ యాజ‌మాన్యం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మార్చి 1 అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు వైద్య సేవ‌లను నిలిపి వేయ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే పెస్ట్ కంట్రోల్, శానిటేష‌న్ వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ నుంచి వైద్యసేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 9988177704 నంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement