త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. 20 మందికి తీవ్ర గాయాలు

RTC Bus | రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ (Hayathnagar) స‌మీపంలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కుంట్లూరు రాజీవ్ గృహ‌క‌ల్ప వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సును (RTC Bus) టిప్ప‌ర్ ఢీకొట్టింది.

G

Hyderabad | Published On Sep 15, 2026, 12.52 pm IST

RTC Bus | ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. 20 మందికి తీవ్ర గాయాలు
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ (Hayathnagar) స‌మీపంలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కుంట్లూరు రాజీవ్ గృహ‌క‌ల్ప వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సును (RTC Bus) టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో బ‌స్సులో ఉన్న 20 మంది ప్ర‌యాణికులు తీవ్రంగా గాయప‌డ్డారు. స్థానికులు వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హ‌నుమ‌కొండ‌లో (Hanumakonda) జ‌రిగిన‌ ఘ‌ట‌న‌లో ఆర్టీసీ బ‌స్సుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. హ‌నుమ‌కొండ ప‌బ్లిక్ గార్డెన్ మూల‌మ‌లుపు వ‌ద్ద సిరిసిల్ల (Sircilla) డిపోన‌కు చెందిన బ‌స్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకున్నాయి. దీంతో భారీ వృక్షం ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయింది. అక్క‌డ ఆగిఉన్న రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సును అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement